ప్రతిభ కనబర్చని ఉద్యోగుల పై వేటు: ఇన్ఫోసిస్

ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతలు గడించిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ‘ఇన్ఫోసిస్' ప్రతిభ కనబర్చని ఉద్యోగుల పై వేటు విధించేందుక రంగం సిద్థం చేస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఈ దిగ్గజ ఐటీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అత్యధిక జీతాలు తీసుకుంటూ అందుకు అనుగుణంగా పనితీరును కనబర్చని ఉద్యోగులకు పిక్ స్లిప్లు జారీ చేయబడతాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
ఇన్ఫోసిస్ భారతదేశంలో పేరొందిన బహుళజాతి సాప్ట్వేర్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్దఐటి కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థకు భారతదేశంలో 9 డెవెలప్మెంట్ సెంటర్లు ఇంకా ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. బెంగళూరు లోని విస్తారమైన ఇన్ఫోసిస్ హైటెక్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణం. ఇన్ఫోసిస్ గురించిన పలు ఆసక్తికర అంశాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications