డిజిటల్ విలేజ్గా తెలంగాణాలోని మారుమూల గ్రామం
గ్లోబల్ ఐటీ దిగ్గజం ఇంటెల్, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్కు అనుబంధంగా తెలంగాణాలోని మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట్ నియోజికవర్గంలోని నడింపల్లి గ్రామాన్ని మోడల్ డిజిటల్ విలేజ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఏక్ కదమ్ ఉన్నతీ కి ఓర్' (అభివృద్థి దిశగా ఒక్క అడుగు) అనే గొప్ప అభివృద్థి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి అందిరికి కంప్యూటర్ శిక్షణను ఇవ్వనున్నారు.

శిక్షణ పూర్తి అయిన తరువాత సర్టిఫికెట్లను అందజేస్తారు తెలంగాణా వ్యాప్తంగా 1000 గ్రామాల్లో ఈ అభివృద్థి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇంటెల్ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఈ అభివృద్థి కార్యక్రమాలను చేపట్టేందుకు ఇంటెల్ ప్రణాళికలు రచిస్తోంది.
Read More : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త మొబైల్ యాప్
తెలంగాణ మోడల్ డిజిటల్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంటెల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాత భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది. డిజిటిల్ ఇండియాకు తోడ్పాటుగా చేపడుతోన్నఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంటర్నెట్ పై అవగాహన కల్పిస్తారు.


Click it and Unblock the Notifications








