ప్రభుత్వం వేసిన జరిమానా చూసి షాక్తిన్న జియో
జియోకి భారీ జరిమానా, ఎంతో తెలిస్తే షాకే మరి ?
ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు రిలయన్స్ జియోకు ప్రభుత్వం భారీ ఫైన్ విధించింది. ఆ జరిమానా గురించి తెలిస్తే అందరూ షాక్ తినాల్సిందే. వేట కోట్ల పెట్టుబడులతో దూసుకుపోతున్న జియోకు ప్రభుత్వం విధించన జరిమానా కేవలం రూ. 500 మాత్రమే.. ఏందీ షాక్ తిన్నారా..మీరు షాక్ తిన్న ఇది నమ్మలేని నిజం.
జియోకు మేము అనుమతి ఇవ్వలేదు: కేంద్రప్రభుత్వం

అక్షరాలా ఐదువందల రూపాయలు.
రిలయన్స్ జియో ప్రకటనల్లో అనుమతి లేకుండా ప్రధాని నరేంద్రమోదీ ఫొటో వాడుకున్నందుకు రిలయన్స్కు విధించనున్న జరిమానా ఎంతో తెలుసా? అక్షరాలా ఐదువందల రూపాయలు.

ప్రతిపక్షాలు నిలదీయడంతో
అనుమతి లేకుండా ప్రధాని ఫోటోను జియో వాడుకోవడంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీయడంతో ప్రధాని మోదీ ఫొటో వాడుకునేందుకు కేంద్రం ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ప్రసారశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అతిక్రమించినందుకు చర్యలు
అనుమతి లేకుండా ఫొటో వాడుకున్నందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు 1950 చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ చట్టం ప్రకారం
ఇప్పుడు ఈ చట్టం ప్రకారం రిలయన్స్ కు కేవలం రూ .500 జరిమానా విధించనున్నారు.చిహ్నాలు, పేర్ల అక్రమ వినియోగ నిరోధానికి సంబంధించిన చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఇంతే విధించాలని ఉంది. అందుకని రూ. 500 జరిమానా విధించారు.

ఒక ప్రైవేటు సంస్థ తన ప్రకటనలలో
ఒక ప్రైవేటు సంస్థ తన ప్రకటనలలో ప్రధానమంత్రి ఫొటోను ఉపయోగించుకోవడంపై ప్రతిపక్షం తీవ్రంగా ప్రశ్నించింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం ప్రకటనలలో కూడా ప్రధాని ఫొటో వచ్చిందని, దీన్ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

ఒక ప్రైవేటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా చూసే చట్టం
ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా చూసే చట్టం ఏమైనా ఉందా అని నీరజ్ శేఖర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం దాటవేసిన ప్రసార మంత్రి మోదీ ఫొటో దుర్వినియోగంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.అందితే అప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటామన్నారు.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








