త్వరపడండి: రూ.24కే 1 జిబి డేటా, ఎన్ని సార్లయినా..
సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న జియోకు ఇప్పుడు అన్నీ టెల్కోలు అదే సంచలన ఆఫర్లతో షాక్ ఇస్తున్నాయి. జియో ఉచితంతో భారీగా నష్టపోయిప టెల్కోలు ఆనష్టాన్ని పూడ్చుకునేందుకు తమ వినియోగదారులకు వరాల జల్లులను కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్సెల్ ఓఅడుగు ముందుకేసి 24 రూపాయలకే 1జిబి డేటాను అందిస్తోంది.ఆపర్ విశేషాలేంటో మీరే చూడండి.
జియోకి ఎయిర్టెల్ సవాల్ :సెకనుకు 100 Mbps స్పీడ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వినియోగదారులకు
పండగలను పురస్కరించుకుని ఎయిర్సెల్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వినియోగదారులకు ప్రత్యేక డేటా ఆఫర్ను ప్రకటించింది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

24 రూపాయలకే 1జిబి డేటా
ఇందులో భాగంగా 24 రూపాయలకే 1జిబి 3Gడేటా ఆఫర్ను తీసుకువచ్చినట్లు ఎయిర్సెల్ తెలిపింది.

ప్రస్తుత వినియోగదారులందరికీ
329 రూపాయలతో రీచార్జీ చేసుకున్న ప్రస్తుత వినియోగదారులందరికీ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉండే విధంగా 2జిబి డేటాను ఆఫర్ చేస్తుండగా దీనికి అదనంగా 24 రూపాయల రీచార్జీ చేసుకుంటే వారికి మరో 1జిబి డేటాను అందించనున్నట్లు పేర్కొంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నిసార్లయినా
వినియోగదారులు 28 రోజుల్లో 24 రూపాయల విలువ గల రీచార్జీని ఎన్నిసార్లయినా చేసుకోవచ్చని తెలిపింది.

ప్రాంతాలను బట్టి మార్పు
ఈ సర్వీసును తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు. కర్ణాటక, ఒరిస్సా, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ఇంకా పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రాంతాలను బట్టి అక్కడ రూ. 24 నుంచి 41 వరకు దాని ధర ఉంటుందని తెలిపింది. అలాగే పస్ట్ రీఛార్జ్ కూడా ప్రాంతాలను బట్టి రూ. 291 నుంచి రూ. 329 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








