Just In
- 1 hr ago WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- 3 hrs ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 6 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 7 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
Don't Miss
- News ఏప్రిల్ నెల ఈ రాశులకు అద్భుతంగా ఉంటుంది
- Sports IPL 2024: మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవు.. ఆర్సీబీపై ఫ్యాన్స్ ఫైర్వీడియో
- Movies టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Lifestyle చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీలో మెరవనున్న మోడల్ రూమి అల్ఖహ్తానీ?ఈ అందగత్తె ఎవరో తెలుసా
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
ఇండియా సరిహద్దులో ఏలియన్స్ కలకలం
గ్రహాంతర వాసులు వున్నారా..? వుంటే ఎక్కడున్నారు..? ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఆధారాలు లేవు. కానీ అప్పుడప్పుడూ ఇవి వున్నాయనే గుర్తులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈసారి ఏకంగా వీటి జాడే కనిపించింది. అక్కడెక్కడో కాదు భారత్ - చైనా సరిహద్దు ప్రాంతాల్లోనే. గ్రహాంతర వాసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్నారట. మహిమాన్విత మంచుకొండల్లో సరిగమలు పాడుతున్నారట.. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాల్లో కాబట్టి సేఫ్ జోన్ అదే అనుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారట. దొరికిన ఆధారాలు దీనికి మరింత బలాన్నిస్తున్నాయి.మిగతా కథనం స్లైడర్ లో..
Read more: చందమామపై డ్యాన్స్లేస్తున్న ఏలియన్స్
సరిహద్దు సైనికులు యూఎఫ్వోలను చూశామని..
గత రెండేళ్లనుంచి భారత్ - చైనా సరిహద్దులోని హిమాలయ పర్వత శ్రేణుల్లో.. సరిహద్దు సైనికులు యూఎఫ్వోలను చూశామని చెబుతున్నారు. నిజంగా గ్రహాంతర వాసులు తమ స్థావరాలను హిమాలయ శిఖరాల్లో ఏర్పాటు చేసుకున్నాయా? గ్రహాంతర వాసుల జాడ వేరే గ్రహాల మీద వెతుకుతున్న మనం.. ఈ భూమి మీద కనిపిస్తున్న వాడి జాడలను మాత్రం పట్టించుకోవడం లేదు.
సాక్షాత్తూ బోర్డర్లోని సైనికులే..
అసలు అవి ఎక్కడున్నాయో తెలిస్తే ఓ పరిశోధన అంటూ చేయొచ్చంటున్నారు పరిశోధకులు. వారికోసమే అన్నట్లుగా గ్రహాంతర వాసుల అడ్రస్ దొరికింది. ఇండియా - చైనా సరిహద్దులో యూఎఫ్వోలు కనిపించాయన్నది వాస్తవం. సాక్షాత్తూ బోర్డర్లోని సైనికులే వీటిని చూశారు. స్కైరాకెట్ ప్రయోగించడాన్ని తాము స్పష్టంగా చూశామని సైనికులు చెబుతున్నారు.
పసుపు రంగులో వింత గోళాకారంలో
పసుపు రంగులో వింత గోళాకారంలో ఉన్నాయని అంటున్నారు. స్కై రాకెట్ను మోసుకుపోతున్నట్టుగా ఉన్న వళయాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి చైనా వైపు ప్రయాణించాయని చూసిన వారు చెబుతున్నారు.
గ్రహాంతర వాసులు ప్రయాణించే కొన్ని వాహనాలను ..
చైనా సరిహద్దుల్లో కొన్ని గ్రహాంతర వాసులు ప్రయాణించే కొన్ని వాహనాలను చూశామని చెబుతున్న వారు కోకొల్లలు. గత ఆగస్టు నుంచి కనీసం వంద యూఎఫ్వోలను చూశామని చెబుతున్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు పంపించామని చెప్పారు సైనికులు.
చైనా పంపించిన ఓ నిఘా వ్యవస్థ అయి వుండొచ్చని ..
అయితే ఇటీవల చైనా డ్రోన్ తయారు చేసింది. బహుశా అదే అయి వుండొచ్చని, లేకపోతే చైనా పంపించిన ఓ నిఘా వ్యవస్థ అయి వుండొచ్చని ఓ ఆర్మీ అఫీషియల్ అంటున్నారు. అయితే డ్రోన్ గాని, చైనా పంపించిన శాటిలైట్లు అయ్యే అవకాశం లేదని స్వయంగా ఆర్మీ అధికారులే చెబుతున్నారు.
గత మూడు నెలలుగా ఈ వింత వస్తువులు ..
గత మూడు నెలలుగా ఈ వింత వస్తువులు కనిపిస్తుండడంతో అవేంటో కనిపెట్టడానికి రాడార్లను ప్రయోగించారు. కానీ అవేంటో కనిపెట్టలేకపోయారు. నాన్ మెటలిక్తో తయారు చేసిన వాహనాలు కావటం వల్లే రాడార్లు గుర్తించలేకపోయాయని చెబుతున్నారు.
ఐదారేళ్ల క్రితం కూడా ఇటువంటివి కనిపించాయని ..
భారత్ - చైనా సరిహద్దుల్లో ఇటువంటి వింత వస్తువులు కనిపించడం ఇప్పుడేం కొత్తకాదు. ఐదారేళ్ల క్రితం కూడా ఇటువంటివి కనిపించాయని హయ్యార్ అఫీషియల్స్కు వీటికి సంబంధించిన వివరాలు చెప్పినా పట్టించుకోలేదని ఆర్మీ సైనికులు చెబుతున్నారు. పర్వతారోహకులు కూడా 2004లోనే వీటిని చూసినట్లు రిపోర్టులు ఉన్నాయి.
ఆగస్టు 4న లగన్ ఖేల్ ప్రాంతంలో..
ఆగస్టు 4న లగన్ ఖేల్ ప్రాంతంలో వీటిని చూసినట్లు సైన్యం పై అధికారులకు నివేదిక పంపింది. గత కొన్ని నెలల్లో దాదాపు వంద సార్లు యూఎఫ్ఓలు కన్పించాయని, అయితే చాలా కాలం తర్వాత మళ్లీ కన్పించాయని సైన్యం పేర్కొంటోంది.
యూఎఫ్ఓల గురించి కచ్చితమైన ఆధారాలేమీ..
వీటి విషయమై పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ అప్పటి రక్షణ మంత్రి ఆంటోనీ యూఎఫ్ఓల గురించి కచ్చితమైన ఆధారాలేమీ లభ్యంకాలేదన్నారు.
శాస్త్ర పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని..
శాస్త్ర పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని, లడఖ్ లాంటి ఎత్త్తెన ప్రాంతం నుంచి బాగా కన్పిస్తాయని వాటిని చూసే సైన్యానికి చెందిన సిబ్బంది యూఎఫ్ఓలుగా భ్రమిస్తోందని అంటున్నారు...
గ్రహాలుగా అంగీకరించేందుకు సైన్యం ససేమిరా..
అయితే, వీటిని గ్రహాలుగా అంగీకరించేందుకు సైన్యం ససేమిరా అంటున్నట్టు తెలుస్తొంది. గురు, శుక్ర గ్రహాల గురించి తమకు తెలుసునని, వాటిని రోజూ స్పష్టంగా చూస్తూనే వుంటామని, వాటిని చూసి యూఎఫ్ఓలని ఎలా భ్రమిస్తామని ఓ సైన్యాధికారి ప్రశ్నించారు.
ఇండో టిబెటన్ బార్డర్ దళాలు ఎగురుతున్న పళ్లాల వంటి వాటిని చూశారని..
కాగా, 2012లోనే కార్గిల్-లెహ్, చైనా సరిహద్దులను పర్యవేక్షించే '14 కార్ప్స్' మిలటరీ విభాగం నుంచి ఆర్మీ హెడ్క్వార్టర్స్కు అందిన సమాచారం ప్రకారం ఇండో టిబెటన్ బార్డర్ దళాలు ఎగురుతున్న పళ్లాల వంటి వాటిని చూశారని, పెన్గాంగ్సో సరస్సు సమీపంలో ఇవి కనిపించాయని వెల్లడించింది.
వీటి చుట్టూ వలయాలు కూడా వున్నాయని..
ఇవి పసుపు రంగులో వున్నాయని, వీటి చుట్టూ వలయాలు కూడా వున్నాయని, ఇవి మెల్లగా చైనా భూభాగం వైపు వెళ్లాయని, కనీసం మూడు నుంచి ఐదు గంటల పాటు కనిపించాయని తెలియజేసింది. కాగా, ఇవి చైనా డ్రోన్లు లేదా శాటిలైట్లు కావచ్చని అప్పట్లో అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కెమెరా.
కదులుతున్న భూమి, అంతరిక్షంలో ఎగిరి వచ్చిన మూడు యూఎఫ్ఓలు అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కెమెరా కంటికి చిక్కాయి.
నాసా ఐఎస్ఎస్ వీడియో ఫీడింగ్ను ఆపేసింది..
నాలుగు నిమిషాల పాటున్న ఈ వీడియో సామాజిక మాధ్యమం యూట్యూబ్ లో అప్ లోడ్ కాగా, ఇప్పటికే 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఐఎస్ఎస్ లైవ్ కెమెరా ఈ దృశ్యాలను చిత్రీకరించగా, విషయం బయటకు పొక్కేసరికి నాసా ఐఎస్ఎస్ వీడియో ఫీడింగ్ను ఆపేసింది. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు నిరసన తెలిపారు.
వీడియో స్థానంలో ‘ప్లీజ్ స్టాండ్ బై' అన్న మెసేజ్..
బింగో... భూమిని దాటిపోతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి" అని కామెంటర్ మైఖేల్ క్లోతీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నాసా అధికారికంగా స్పందించలేదు. ఐఎస్ఎస్ లైవ్ ఫీడ్ ఇచ్చే వీడియో స్థానంలో ‘ప్లీజ్ స్టాండ్ బై' అన్న మెసేజ్ మాత్రం ఉంచింది.
అమెరికన్ శాస్త్రవేత్త.. బోయ్ద్ బుష్ మ్యాన్ అందించిన సమాచారం ప్రకారం..
యూఎఫ్ఓలు నిజంగా ఉన్నాయా..లేక అది ఒక కల్పనేనా అనే సందేహాలు ఇప్పటివరకు మనకు ఉండేవి. ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త.. బోయ్ద్ బుష్ మ్యాన్ అందించిన సమాచారం ప్రకారం యూఎఫ్ఓలు నిజంగా ఉన్నాయని.. అమెరికా ప్రభుత్వం కోసం 18 ఎలియన్స్ పనిచేస్తున్నాయని తెలిపారు.
ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా రహస్య మిలటరీ బేస్
బుష్ మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర లాస్ వేగాస్ కు 85మైళ్ళ దూరంలో నెవెడా ఎడారి ప్రాంతం ఉన్నదని.. ఆ ప్రాంతంలో ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా రహస్య మిలటరీ బేస్ ఉన్నదని.. దానిని డ్రీంల్యాండ్ అని పిలుస్తారని చెప్పారు.
1955నుంచి పరిశోధనలు జరుపుతున్నట్టు బుష్ మ్యాన్..
ఈ ప్రాంతంలో 1955నుంచి పరిశోధనలు జరుపుతున్నట్టు బుష్ మ్యాన్ తెలిపారు. బుష్ మ్యాన్ ఆగష్టు 7న మరణించారు. ఆయన మరణించే ముందు బుష్ మ్యాన్ ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
ముంబై విమానాశ్రయం సమీపంలో ఐదు యూఎఫ్ ఓలు ..
ఇదిలా ఉంటే ముంబై విమానాశ్రయం సమీపంలో ఐదు యూఎఫ్ ఓలు కనిపించాయని అక్కడి స్థానికులు చెప్పారు. వీటిని వందల సంఖ్యలో ప్రజలు చూశారు. తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
పోలీసులకు సైతం స్పష్టత లేకపోవడం
ఇవేంటన్న విషయం పోలీసులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో టేకాఫ్ అయిన జెట్ విమానం పైలెట్ వీటిని చూసి ఆ వెంటనే విమానాన్ని కిందికి దించి ఏటీసి అధికారులకు సమాచారమిచ్చారు కూడా.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం గ్రహాంతరవాసులు అనేవాళ్లు కనుక భూమి మీదకు వస్తే నేను పెద్దగా ఆశ్చర్యపడను అన్నారు..
ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాకపోవచ్చు
అంటే ఏలియన్స్ ఉన్నారని మీ ఉద్దేశమా?'' అన్నప్పుడు, ‘ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాకపోవచ్చు'' అన్నారు! దీంతో ఏలియన్స్ మళ్లీ చర్చనీయాంశం అయ్యాయి.
గిజ్బాట్ పేజీని లైక్ చేయండి
మీరు టెక్నాజలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లకి చేయండి. https://www.facebook.com/GizBotTelugu
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470