మిటాషి నుంచి 4K LED TV లాంచ్..ధర రూ 79,990!
ఇండియాలో 55అంగుళాల క్వర్డ్ 4కే ఎల్ఈడి టీవీనీ లాంచ్ చేసిన మిటాషి ఎలక్ట్రానిక్స్ కంపెనీ
భారతీయ అగ్రగామి ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటైన మిటాషి..కొత్త ఒక 55 అంగుళాల 4కే కర్వ్డ్ LED TVని లాంచ్ చేసింది. దీని ధర 79,990 రూపాయలుగా నిర్ణయించారు. ఇది దేశంలోని అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైల్ దుకాణాల్లో కొనుగోలుకు సిద్దంగా ఉంది.
మార్కెట్లోకి BlackBerry Motion, ఫీచర్లపై ఓ లుక్కేయండి

మిటాషి నుంచి తాజాగా రిలీజ్ అయిన ఎల్ఈడి టీవీ ఫీచర్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. యూజర్లను ఫీచర్స్ ఎంతగానో అట్రాక్ట్ చేయనున్నాయి. ఈ ఎల్ఈడి టీవీ ఆండ్రాయిడ్ ద్వారా రన్ అవుతుంది. 3840×2160 పిక్సెల్స్ తోపాటు 4కే ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. UHD రిజల్యూషన్ను అందిస్తుంది. డిస్ల్పే ఫీచర్స్ డైనమిక్ కాంట్రాస్ట్ నిష్పత్తిలో 4,00,00:1 ఉంటుంది. అంతేకాదు ప్యానెల్ను శాంసంగ్ డిస్ప్లే ద్వారా ప్రొడక్ట్ చేస్తుంది. క్వర్డ్ డిస్ల్పే తో ఉండటం వల్ల..వీక్షకులు అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదిస్తారు.
అయితే ఈ ప్రైస్ రేంజ్లో లభించే ఇతర టీవీల మాదిరిగానే కాకుండా...ఈ టీవీ డిస్ప్లే యాడెడ్ ప్రొటెక్షన్ కోసం టెంపర్డ్ గ్లాస్ తో కప్పబడి ఉంటుంది. మిటాషి నుంచి వస్తున్న ఈ స్మార్ట్ ఎల్ఈడి టీవీ, USB మూవీ ప్లగ్ –అండ్ –ప్లే , HDMI ఇన్పుట్, PC ఇన్పుట్, ఇన్బిల్ట్ వై-ఫై మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి అన్ని ఆప్షన్స్ తోపాటు మోడ్రన్ ఆప్షన్స్ తో ప్యాక్ చేయబడింది.
స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్స్ తో మీరు మీ స్మార్ట్ఫోన్ నుంచి మీ టీవీకి ఈజీగా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇమేజేస్ లాంటివి మీ ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.
టీవీతోపాటు ఎయిర్ మౌస్ కూడా పొందుతారు. దీంతో ఈజీగా నావిగేట్ చేయవచ్చు. అంతేకాదు, మిటాషి ఫ్రీ వాల్ మౌంట్ అందిస్తోంది. ఈ టెలివిజన్ను కొనుగోలు చేసిన యూజర్లు మూడు సంవత్సరాలు వారంటీని కూడా పొందుతారు.


Click it and Unblock the Notifications








