భూమిని ఢీ కొట్టేందుకు స్పేస్ జంక్ దూసుకొస్తోంది
ఆకాశంలో ఎన్నో వ్యర్థాలు... కాలపరిమితి ముగిసిపోయిన రాకెట్లు...అలాగే ఉనికిని కోల్పియిన శాటిలైట్లు..రాడార్లకు అందక వదిలేసిన శాటిలైట్లు..అబ్బో చెప్పుకుంటూ పోతే అంతరిక్షంలో ఎన్నో గింగరాలు తిరుగుతున్నాయి..ఇవి ఎప్పుడు భూమిని పటాపంచలు చేస్తాయో తెలియదు...ఎప్పుడు ఏ గ్రహశకలం భూమిని ఢీ కొంటుందో తెలియదు..అదే జరిగితే మరో పెను విపత్తు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం..అయితే ఇప్పుడు అదే జరగబోతుందట..భూమిని ఢీ కొట్టడానికి ఓ స్పేస్ జంక్ రెడీగా ఉందట.మిగతా కథనం స్లైడర్ లో ..
Read more: ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది

నవంబర్ 13న గుర్తు తెలియని ఓ స్పేస్ జంక్..
నవంబర్ 13న గుర్తు తెలియని ఓ స్పేస్ జంక్ భూమిని ఢీ కొట్టనుందని శాస్ర్తవేత్తలు ప్రకటించారు.ఇది భూమిని ఢీ కొట్టేందుకు అమిత వేగంతో దూసుకొస్తోందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

దీనికి డబ్ల్యూటీఎఫ్ అని పేరు ..
ఇది ఏమిటనే విషయం స్పష్టంగా తెలియదని దీనికి డబ్ల్యూటీఎఫ్ అని పేరు పెట్టామని సైంటిస్టులు వెల్లడించారు.ఇది దాదాపు 7 అడుగుల ఎత్తుతో 2 మీటర్ల పొడవును కలిగి ఉందని రాకెట్ అయి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

శ్రీలంక తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హిందూ మహసముద్రంలో...
శ్రీలంక తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హిందూ మహసముద్రంలో ఉదయం 6.15 గంటల సమయంలో ఇది కూలుతుందని వివరించారు.దీనివల్ల పెను ప్రమాదం తప్పిందని వారు చెబుతున్నారు

అంతరిక్ష చరిత్రలో ఉనికిని పోగొట్టుకున్న ఓ వస్తువేదో ..
అంతరిక్ష చరిత్రలో ఉనికిని పోగొట్టుకున్న ఓ వస్తువేదో మనల్ని వెంటాడుతూ వస్తోందని హర్వార్డ్ -స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్ర్తవేత్త జొనాధన్ మెక్ డొవెల్ వెల్లడించారు.

భూమి వాతావరణంలోకి రాగానే మండిపోతుందని ..
దీన్ని ఆరిజోనా వర్సిటీలోని కాటలినా స్కై సర్వే సెంటర్ తొలిసారి గుర్తించిందని తెలిపారు. ఇది భూమి వాతావరణంలోకి రాగానే మండిపోతుందని కాబట్టి మానవాళికి ప్రమాదం ఉండదని అన్నారు.

అంతరిక్ష వ్యర్థాలు సుమారు 5 లక్షలకు పైగా భూమికి సమీపంలో ..
ఈ తరహా అంతరిక్ష వ్యర్థాలు సుమారు 5 లక్షలకు పైగా భూమికి సమీపంలో తిరుగుతున్నట్లు గతంలో నానా ప్రకటించింది. ఇవి ఎప్పుడు భూమిని ఢీకొంటాయో తెలియదని కాని వీటివల్ల భూమికి పెనుముప్పు తప్పదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భూమిని ఢీ కొట్టనున్న ఈ స్పేస్ జంక్ అపోలో మిషన్ కు సంబంధించినదని..
ఇప్పుడు భూమిని ఢీ కొట్టనున్న ఈ స్పేస్ జంక్ అపోలో మిషన్ కు సంబంధించినదని అది సాటర్న్ రాకెట్ కు సంబధించనది అయి ఉండవచ్చని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నారు. 2002లో చంద్రునిపై మొదటిసారిగా దర్శనమిచ్చిన రాకెట్ నుంచి ఈ ముక్క విడిపడి ఇప్పుడు తన ఉనికిని కోల్పోయి భూమి మీదకు వస్తుందని వారు ఊహించి చెబుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో
దీనికి సంబంధించిన వీడియో


Click it and Unblock the Notifications








