‘2020లో మార్స్ పైకి మరో రోవర్’

By Prashanth
|
NASA


అంగారకుడిపై సురక్షితంగా కాలుమోపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడ విజుయవంతంగా శోధన చేపడుతున్ననేపధ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వచ్చే 2020లో మరో రోవర్‌ను అరుణగ్రహం పైకి పంపనున్నట్లు ప్రకటించింది. మార్స్‌పై పరిశోధనల కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్ వెల్లడించారు. వచ్చే 2030 నాటికి మానవసహిత అంగారకయాత్ర చేపట్టాలని భావిస్తున్న నాసా.. 2016లో ‘ఇన్‌సైట్’ రోవర్‌ను అక్కడికి పంపనున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. దీంతో మార్స్‌పై పరిశోధనలో అమెరికా రోవర్ల సంఖ్య ఏడుకు చేరుకోనుంది. క్యూరియాసిటీని మార్స్‌పై సురక్షితంగా దించగలగడం, అది విజయవంతంగా పనిచేస్తుండటంతో కొత్త రోవర్లను కూడా దాని డిజైన్ ఆధారంగానే రూపొందించనున్నట్లు నాసా తెలిపింది.

అంగారకుడి పై అద్భుతాలు!

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X