భారతీయులు బిచ్చగాళ్లు, చిక్కుల్లో చైనా కంపెనీ?
కలంకలం రేపుతోన్న అనుమానాస్పద లేఖ.
ప్రముఖ చైనా ఫోన్ల కంపెనీ ఒప్పో ఓ వివాదంలో ఇరుక్కుంది. ఒప్పో పంజాబ్ సర్వీస్ సెంటర్లో విధులు నిర్వహిస్తోన్న పలువురు ఉద్యోగుల పేరుతో పోస్ట్ అయిన లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇంకా చదవండి : ఉచితంగా జియో 4జీ ఫోన్, 24 నుంచి బుకింగ్స్, రూ.153కే అనిలిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్

కంపెనీ పై అధికారులు తమను బిచ్చగాళ్లుగా పేర్కొన్నట్లు ఈ లేఖలో వారు ఆరోపించారు. ఈ కారణంగానే తాము విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ లేఖలో ఉంది. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోన్న ఈ లేఖ పై ఒప్పో ఇండియా స్పందించింది.
ఈ లేఖ పూర్తిగా నిరాధారమని కేవలం సమాచార లోపం కారణంగానే ఇలా జరిగిందని ఒప్పో ఇండియా చెప్పుకొచ్చింది. తమ సర్వీసింగ్ సెంటర్లో ఏ ఒక్కరూ రిజైన్ చేయలేదని ఒప్పో తెలిపింది. ట్విట్టర్లో ముందుగా పోస్ట్ అయిన ఈ అనుమానాస్పద లెటర్ సదురు సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తోన్న ఉద్యోగి పేరు మీదే ఉండటం విశేషం.
ఇంకా చదవండి : జియోఫోన్ లాంచ్ అయ్యింది, అందరికి ఉచితం, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి


Click it and Unblock the Notifications








