రంగుల ప్రపంచం నుంచి విమాన ప్రపంచంలోకి
సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి తనయుడు విమాన రంగంలోకి ప్రవేశించి తన సత్తాను చాటుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే విమాన రంగంలోని పలు కంపెనీలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. అయినా రామ్ చరణ్ ధైర్యం చేసి విమానరంగాన్ని ఎంచుకుని తన సత్తాను చాటడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆయన తొలిసారి హైదరాబాద్ - తిరుపతి మధ్య తన విమానాన్ని రివ్వున ఆకాశంలోకి పంపిచారు. ఏపీలో ఇప్పటికే పలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే ట్రూజెట్ లో విశేషాలు ఏమున్నాయి ఓ సారి పరిశీలిద్దాం.

రామ్ చరణ్ ట్రూజెట్ పేరుతో తీసుకువచ్చిన విమానం పేరు ATR -72 500. ఇందులో 74 మంది ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. ఇద్దరు ఫైలెట్లు ఉంటారు. ఇప్పటికే మూడు విమానాలు ట్రూజెట్ లో ఉన్నాయి. ప్రెంచ్ ఇటాలియన్ అనుబంధంతో విమానాలు తయారవుతున్నాయి. ఈ విమానాల తయారీ కంపెనీ తొలిసారిగా తన విమానాన్ని 1988లో ప్రవేశపెట్టింది. అయితే 1989లో దానిని బయటకు తెచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఇప్పటివరకు 754 విమానాలు తయారు చేసింది.విమానం ప్రారంభం నుంచి 72 నుంచి మొదలెడితే ఇప్పటి వరకు 600 పైనే నంబర్లు తో విమానాలు బయటకు వచ్చాయి.
రామ్ చరణ్ టర్బో మేఘా తొందరలోపూర్తి స్థాయిలో గాలిలో చక్కర్లు కొట్టనుందన్న మాట.


Click it and Unblock the Notifications








