Home
News

40 రోజులలొ 2 మిలియన్లకు చేరుకున్న శామ్సంగ్ గెలాక్సీ A ఫోన్ అమ్మకాలు

శామ్సంగ్ ఇటీవలే ఇండియాలో కొత్తగా అప్డేట్ చేయబడిన గెలాక్సీ A సిరీస్ ని ప్రారంభించింది ఇది దేశంలో అతిపెద్ద బ్రాండ్ గా తయారు చేయడానికి ఉద్దేశించింది

శామ్సంగ్ ఇటీవలే ఇండియాలో కొత్తగా అప్డేట్ చేయబడిన గెలాక్సీ A సిరీస్ ని ప్రారంభించింది ఇది దేశంలో అతిపెద్ద బ్రాండ్ గా తయారు చేయడానికి ఉద్దేశించింది. కొత్త గెలాక్సీ A ఫోన్లు ఇప్పుడు అనేక దేశాలలో కొనుగోలు చేయగలిగినప్పటికీ 2019 చివరికి భారతదేశంలో మాత్రమే ఒక్కసారిగా $ 4 బిలియన్ల ఆదాయం లభిస్తుందని శామ్సంగ్ భావిస్తోంది.

samsung sold 2 million galaxy a phones india within 40 days launch

మరియు ఆ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ బాగా ట్రాక్లో ఉంది. ఇది ఇప్పటికే భారతదేశంలో తాజా గెలాక్సీ A స్మార్ట్ఫోన్లలో 2 మిలియన్ యూనిట్లను విక్రయించింది.

శామ్సంగ్ $ 4 బిలియన్ లక్ష్యాన్ని అధిగమించగలదని  నమ్మకంగా ఉంది

శామ్సంగ్ $ 4 బిలియన్ లక్ష్యాన్ని అధిగమించగలదని నమ్మకంగా ఉంది

శామ్సంగ్ ఇండియాకు చెందిన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాంజీవిజిత్ సింగ్ శామ్సంగ్ మార్క్కెట్ గురించి రివిల్ చేశాడు. శామ్సంగ్ ఇటీవలే మూడు గెలాక్సీ A ఫోన్లలో A10, A30 మరియు A50 లు మార్చి 1నుంచి 40 రోజుల కాలవ్యవధిలో రెండు మిలియన్ యూనిట్లను రవాణా చేశారు. అమ్మకాల నుండి రాబడి టర్నోవర్ $ 500 మిలియన్లు. ఇది "పరిశ్రమలో బ్రాండుకు ఓ రికార్డు" అని సింగ్ చెప్పారు.

A సిరీస్

A సిరీస్

త్వరలో వస్తున్న A సిరీస్ ఫోన్లతో శామ్సంగ్ $ 4 బిలియన్ లక్ష్యాన్ని అధిగమించగలదని నమ్మకంతో ఉంది. ''పోర్ట్ఫోలియో A సిరీస్ లొ లభ్యమయ్యే మిగిలిన ఫోన్ లు అందుబాటులోకి వచ్చినప్పుడు మన లక్ష్యాన్ని అధిగమించడం సులభం అని ఇండియన్ పబ్లికేషన్ IANS కు ఇచ్చిన ఇంటర్వ్యూ లొ సింగ్ అన్నారు.

గెలాక్సీ A20

గెలాక్సీ A20

గత నెలలో శామ్సంగ్ గెలాక్సీ A ఫోన్లు గెలాక్సీ A10, గాలక్సీA30,గెలాక్సీA50 లను విడుదల చేసింది. ఇది ఇటీవల సిరీస్ కి గెలాక్సీ A20 జోడించబడింది. పైప్ లైన్ లొ తదుపరిది గెలాక్సీ A70. ఇది దేశంలో వచ్చే వారంలో రూ. 25,000- రూ. 30,000 కు ప్రారంభమవుతుంది. గాలక్సీ A80 మేలో ఇండియా లోకి వస్తోంది. ఇది రూ 45,000- Rs 50,000 ధరకే లభిస్తుంది. శామ్సంగ్ ఈ సంవత్సరం జూన్ ముందు వరకు ప్రతి నెల కనీసం ఒక గెలాక్సీ ఫోన్ ప్రారంభించనున్నట్లు చెప్పాడు.

అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కిరీటం

అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కిరీటం

ఇండియాలో చైనా ప్రత్యర్థుల నుంచి శామ్సంగ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. Xiaomi సంస్థ వలన గత సంవత్సరం భారతదేశంలొ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కిరీటం కోల్పోయింది. పునరుద్ధరణ ఆశలు ఇప్పుడు కొత్త గెలాక్సీ A మరియు గెలాక్సీ M సిరీస్ ఫోన్ల మీద ఉన్నాయి .

More from GizBot

Best Mobiles in India

English summary
samsung sold 2 million galaxy a phones india within 40 days launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X