2015 నాటికి గ్రహాంతర వాసులు ఆనవాళ్లు

గ్రహాంతర వాసుల ఆనవాళ్లును 2025 నాటికి కనుగొనే అవకాశం ఉందని, అలానే వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలను 2045 నాటికి వెలికితీసే అవకాశముందని నాసాకు చెందిన శాస్త్రవేత్త ఎల్లెన్ స్టోఫ్యాన్ తెలిపారు. ఇతర గ్రహాల పైన జీవం ఉందని మరో పదేళ్లలో తెలుస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని కచ్చితమైన 20 నుంచి 30 సంవత్సరాలలో వెలుగు చూడవచ్చునని స్టోఫ్యాన్ అన్నారు.
గ్రహాంతర జీవుల అన్వేషణకు సంబంధించి ఎక్కడా చూడాలో, ఏలా చూడాలో నాసాకు తెలసునని ఆయన తెలిపారు. మన సౌర కుటుంబం, ఆ వెలుపల జీవం ఉనికిని చాలా త్వరగానే కనుగొంటామని నాసాకు చెందిన మరో ప్రతినిధి జాన్ గ్రన్స్ఫెల్డ్ అన్నారు.

మనం మన సోలార్ సిస్టంకు మరో జనరేషన్ దూరంలో ఉన్నామని చెప్పారు. హిమయంగా ఉన్న ఏదైనా ఉపగ్రహం కానీ అంగారకుడిపై కానీ సమీపంలోని తార వద్ద కానీ జీవం ఉనికిని కనుగొనే అవకాశం ఉందని చెప్పారు.
ఇంకా చదవండి: ఆ 20 నగరాల్లో.. కొత్త శకం మొదలైందా..?


Click it and Unblock the Notifications








