సోనీ, హువాయ్ కొత్త బ్యాటరీ : కప్పు కాఫీ తాగేలోపు ఛార్జింగ్ పుల్
ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది .స్మార్ట్ పోన్ ల రాకతో గంటలకొద్దీ ఇంటర్నెట్ తో గడిపేస్తున్నారు స్మార్ట్ పోన్ వినియోగదారులు. అయితే ఇలా ఇంటర్నెట్ అతి వినియోగంతో స్మార్ట్ పోన్ల బ్యాటరీ టైం కరిగిపోతోంది. మితిమీరిన ఇంటర్నెట్ వాడకంతో ఫుల్ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కనీసం ఒకరోజు కూడా రావడం లేదు. అతి పవర్ పుల్ కంపెనీ అయితేనే లేకుంటే అది రెండు గంటలో మూడు గంటలో వస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి బెంగలేకుండా సోనీ కంపెనీ శక్తివంతమైన బ్యాటరీని మార్కెట్లోకి తెచ్చింది.
Read more: కూతురి బలగాన్ని చూసి షాకవుతున్న ఫేస్బుక్ సీఈఓ

సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే
సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 40 శాతం ఎక్కువ శక్తిని ఈ బ్యాటరీలో నిల్వచేసే అవకాశం ఉన్నట్లు సోనీ ప్రకటించింది. ఈ బ్యాటరీల తయారీలో లిథియం- సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను వాడినట్లు తెలిపింది.

కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో
కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే అవకాశం ఉందని తెలిపిన సోనీ ... ఇవి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే అని చెబుతోంది.

గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో
గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కూడా సోనీ సంస్థ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే హువాయ్ కంపెనీ అయిదు నిమిషాల్లో 50 శాతం
ఇప్పటికే హువాయ్ కంపెనీ అయిదు నిమిషాల్లో 50 శాతం ఛార్జింజ్ వచ్చేలా బ్యాటరీని రూపొందిస్తామని చెప్పిన విషయం విదితమే.

అంటే మీరు ఓ కప్పు కాఫీ తాగేలోపు
అంటే మీరు ఓ కప్పు కాఫీ తాగేలోపు మీబ్యాటరీ సగం ఛార్జింగ్ ఎక్కుతుంది. దీంతో మీరు ఓ రోజంతా వాడుకోవచ్చు.

3000 ఎమ్ ఏ హెచ్ తో బ్యాటరీని హువాయ్ కంపెనీ
3000 ఎమ్ ఏ హెచ్ తో బ్యాటరీని హువాయ్ కంపెనీ తయారుచేస్తోంది. అలాగే రెండు నిమిషాల్లో 68 శాతం బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా కూడా ఈ కంపెనీ వ్యూహాన్ని రచిస్తోంది. దీనికి సంబంధించిన డెమోని కూడా చూపించింది.

అయితే హువాయ్ బ్యాటరీ రాకతో స్మార్ట్ ఫోన్ల రంగంలో
అయితే హువాయ్ బ్యాటరీ రాకతో స్మార్ట్ ఫోన్ల రంగంలో ఓ కొత్త ఒరవడికి తెరలేస్తుందని వినియోగదారులు సంబరపడుతున్నారు. అలాగే మిగతా కంపెనీలక గట్టి పోటినిస్తుందని వారు చెబుతున్నారు.
పైవ్ మినిట్స్ లో 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు గా
దీనికి సంబంధించిన వీడియోని కూడా కంపెనీ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పైవ్ మినిట్స్ లో 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు గా చూపారు కూడా.

మరొక కంపెనీ కూడా ఒకసారి ఛార్జింగ్ పెడితే వన్ వీక్ వరకు
అయితే ఈ మధ్య మరొక కంపెనీ కూడా ఒకసారి ఛార్జింగ్ పెడితే వన్ వీక్ వరకు ఛార్జింగ్ పెట్టకుండా ఉండే ఫోన్ ను మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇదంతా రూమర్ అని తెలుస్తోంది.

చైనాకు చెందిన ఎల్రక్టానిక్స్ సంస్థ
చైనాకు చెందిన ఎల్రక్టానిక్స్ సంస్థ ఒకటి ఏకంగా 10000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల ఫోన్ ఒకదానిని తయారు చేసింది. ఓకిటెల్ అనే సంస్థ కె10000 పేరు తో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. దీనికి ఒకసారి చార్జింగ్ చేసినట్లయితే దాదాపుగా పది రోజు ల పాటు పని చేస్తుంది. ధర దాదా పుగా రూ. 16 వేలు.
ఇమేజ్ సోర్స్ : హువాయ్


Click it and Unblock the Notifications








