Home
News

Airtel చందాదారుల చేరిక మరింత పెరిగింది!! మారని Vi టెల్కో పరిస్థితి...

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2020 డిసెంబర్ 31 నాటి వరకు టెలికాం సబ్‌స్క్రిప్షన్ డేటాను విడుదల చేసింది. ఈ డేటా సమాచారం ప్రకారం వోడాఫోన్ ఐడియా టెల్కో సుమారు 5.6 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినట్లు వెల్లడించింది. Vi టెల్కో 2020 సంవత్సరంను 269 మిలియన్ల చందాదారుల సంఖ్యతో ముగిసింది. రిలయన్స్ జియో చందాదారుల చేరికల ధోరణి ఎప్పటిలాగే నెమ్మదిగా అలాగే ఉంది.

యూజర్ బేస్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ టెల్కో 2020 చివరి నెలలో కేవలం 478,917 మంది వినియోగదారులను మాత్రమే చేర్చుకున్నది. అలాగే భారతి ఎయిర్‌టెల్ కూడా ఈ నెలలో కేవలం నాలుగు మిలియన్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకున్నది. ఎయిర్‌టెల్ విడుదల చేసిన డేటా సమాచారం ప్రకారం 2020 చివరినాటికి 336 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే జియో 2020 ఏడాది చివరికి 410.8 మిలియన్ల యూజర్ బేస్ తో మొదటి స్థానంలో ఉంది. బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే ఉన్న 2.5 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది.

డిసెంబర్ 2020 ట్రాయ్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ డేటా

డిసెంబర్ 2020 ట్రాయ్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ డేటా

ఇండియాలోని అన్ని టెలికాం సంస్థ‌లలో ఎయిర్‌టెల్ అత్యధిక సంఖ్యలో కొత్తగా క్రియాశీల చందాదారులను చేర్చుకున్నది అని నివేదిక పేర్కొంది. ఇప్పటికి ఎయిర్టెల్ మొత్తంగా 338.71 మిలియన్ల మంది చందాదారులను కలిగి ఉంది. వీరిలో 328.87 మిలియన్ల మంది వినియోగదారులు (97.10%) చురుకుగా ఉన్నారని ట్రాయ్ తెలిపింది. చురుకుగా ఉన్న చందాదారుల జాబితాలో వోడాఫోన్ ఐడియా రెండవ స్థానంలో ఉంది. దీని నెట్‌వర్క్‌లో 90.26% మంది చందాదారులు చురుకుగా ఉన్నారు. జియో యొక్క మొత్తం చందాదారుల సంఖ్యలో కేవలం 80.21% మంది చందాదారులు మాత్రమే చురుకుగా ఉన్నారు.

టెలికాం సంస్థ‌ల మార్కెట్ వాటా

టెలికాం సంస్థ‌ల మార్కెట్ వాటా

ఇండియాలో టెలికాం సంస్థ‌ల మార్కెట్ వాటా విషయానికొస్తే జియో 35.43% వాటాతో చార్టులో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 29.36% వాటాతో మరియు వోడాఫోన్ ఐడియా 24.64% వాటాతో తరువాతి స్థానాలలో ఉన్నాయి. ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ 10.29% మార్కెట్ వాటాతో సంవత్సరాన్ని ముగించింది. 2020 డిసెంబర్ చివరినాటికి మొత్తం వైర్‌లెస్ చందాదారులు 2020 నవంబర్ చివరి నాటితో పోలిస్తే 1,155.20 మిలియన్ల నుండి 1,153.77 మిలియన్లకు తగ్గారు. మొత్తం వైర్‌లెస్ చందాదారులలో 975.43 మిలియన్ల వినియోగదారులు చురుకుగా ఉన్నారు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) డేటా విషయానికి వస్తే 2020 డిసెంబర్‌లో మొత్తంగా 8.20 మిలియన్ల అభ్యర్ధనలు వచ్చినట్లు ట్రాయ్‌ తెలిపింది. ఇందులో పెద్ద సంఖ్యలో వొడాఫోన్ ఐడియా మరియు బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు భారతి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ అవుతున్నట్లు రావడం గమనార్హం. Vi టెల్కో యొక్క అధిక మంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌కు మారినట్లు ట్రాయ్ తెలిపింది.

టెలికాం ఆపరేటర్లు

టెలికాం ఆపరేటర్లు వారి త్రైమాసిక పనితీరు ఫలితాల సమయంలో నివేదించిన డేటా ఈ నివేదికలో ట్రాయ్ విడుదల చేసిన డేటాతో సమానంగా ఉంటుంది. క్యూ 3 ఎఫ్‌వై 21 లో కేవలం రెండు మిలియన్ల మంది సభ్యులను కోల్పోయిందని, కొత్తగా 4 జి కస్టమర్లను చేర్చడం ప్రారంభించిందని వి చెప్పారు. వి కోసం పోరాటాలు ఇంకా ముగియలేదు, కానీ టెల్కో నెమ్మదిగా తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఉత్తమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Trai December 2020 Report: Vi Lost 5.6 Million Users and Airtel Gains 4 Million
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X