ఇకపై కేబుల్ అద్దె నెలకు రూ.130 మాత్రమే
దేశ వ్యాప్తంగా కేబుల్ బ్రాడ్ కాస్టర్స్ వసూలు చేసే ఛార్జిలపై ట్రాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం కొన్ని ప్రాంతాల వారికి లాభం చేకూర్చనుండగా, మరికొన్ని ప్రాంతాల వారికి భారంగా తయారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రూ. 200 ఛార్జ్ చేస్తున్న తరుణంలో వారికి ట్రాయ్ ఝలక్ ఇచ్చింది. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి అయిన నేపథ్యంలో డిజిటలైజేషన్ ధరలపై ట్రాయ్ ఈ రకమైన నిర్ణయాన్ని వెల్లడించింది.
జియో తర్వాత రింగో వంతు..టెల్కోలను ఏకిపారేసింది

నెలకు కనీసం రూ.130 అద్దె
నెలకు కనీసం రూ.130 అద్దె చెల్లించడం ద్వారా 100 ఎస్డీ చానళ్లను వీక్షించే అవకాశం కలగనుంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.130 నెలసరి అద్దెపై 100 స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) చానళ్లను
సెట్టాప్ కనెక్షన్లకు రూ.130 నెలసరి అద్దెపై 100 స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) చానళ్లను అందించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రూ. 200 వరకు వసూలు చేస్తున్నారు.ఇక అలా కుదరదని తెగేసి చెప్పింది.

ఈ నెల 24లోపు అభిప్రాయలు
నూతన చార్జీలతో కూడిన ముసాయిదాను రూపొందించి దీనిపై ఈ నెల 24లోపు అభిప్రాయలు తెలియజేయాలని భాగస్వాములను కోరింది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం
ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక హెచ్.డి. ఛానల్ అనేది రెండు ఎస్.డి.ఛానళ్లతో సమానం.

నచ్చిన చానళ్లను
తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








