ట్విట్టర్లోకి టైమ్లైన్ వచ్చేసింది
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ ఫేస్బుక్ తరహాలో టైమ్లైన్కు శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఇది ఫేస్ బుక్యూ లో మాత్జరమే ఉండేది.యూజర్లు తమకు నచ్చిన పోస్టులను మిస్ కాకుండా సేవ్ చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ట్విట్టర్ కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి టైమ్ లైన్ ఫీచర్నే అందించనుంది.
Read more: 10 వేలతో ట్విట్టర్ డేర్ చేస్తోందా..?
యూజర్లకు ట్విట్టర్ అందించనున్న కొత్త తరహా టైమ్లైన్ ఫీచర్ ఫేస్బుక్లోలా కాకుండా మరో విధంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. యూజర్లు తమ ఇష్టాలకు అనుగుణంగా బెస్ట్ ట్వీట్లను డిస్ప్లే చేసుకునేలా టైమ్లైన్ ఫీచర్ను తీర్చిదిద్దనున్నారు. అతి త్వరలోనే ఈ నయా అప్డేట్ యూజర్లకు అందుబాటులోకి రానుందని ట్విట్టర్ ప్రతినిధులు తమ అధికారిక బ్లాగ్లో వెల్లడించారు.ఇక ట్విట్టర్లో రాజకీయ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ ట్విట్టర్లోకి రానున్నాయి.
Read more: టెర్రర్ కేసుతో షాకయిన ట్విట్టర్

తొలగించిన వివాదస్పద ట్వీట్స్
తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి రాజకీయ నాయకులకు మింగుడు పడని వార్త. ట్విటర్ లో పోస్ట్ చేసి, తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి రానున్నాయి. ఈ మేరకు ట్విటర్ తో పొలిట్ వూప్స్ వెబ్ సైట్ ఒప్పందం కుదుర్చుకుంది.

తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు
తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగానే రాజకీయ నాయకులు వాటిని వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అసలు వారేమన్నారో ప్రజలకు తెలియకుండా పోతోంది. ఇలా తొలగించిన ట్వీట్లను పొలిట్ వూప్స్ ద్వారా తిరిగి పొందవచ్చు.

అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్
భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా 30 దేశాల్లో ఈ సేవలను మళ్లీ ప్రారంభించనుందని సీనెట్ డాట్ కామ్ వెల్లడించింది. అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్ నడుపుతున్న పొలిట్ వూప్స్ వైబ్ సైట్ ను నెదర్లాండ్ కు చెందిన పారదర్శక సంస్థ ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు
పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు అందించింది. అయితే తొలగించిన ట్వీట్లకు సంబంధించిన కోడ్ ఇచ్చేందుకు ట్విటర్ నిరాకరించడంతో గతేదాడి నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి.

ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో
ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా తాము జరిపిన చర్చలు ఫలించడంతో మరోసారి ఈ సేవలు ప్రారంభించనున్నామని ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని
సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. అయితే ట్విటర్ లో తొలగించిన ట్వీట్లను తిరిగి పోస్ట్ చేస్తుందా అనేది స్పష్టం కాలేదు.

గిజ్బాట్ పేజీని లైక్ చేయండి
టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/


Click it and Unblock the Notifications