నేతాజీ మృతిపై గాంధీజీ గందరగోళం
నేతాజీ మరణం వెనుక రోజుకొక కొత్త విషయం బయటప్రపంచానికొస్తోంది. యుకె వెబ్సైట్ బోస్ ఫైల్స్.కాం కొత్త కొత్త అంశాలను అందిస్తోంది. బోస్ మరణం వెనక గాంధీ సృష్టించిన గందరగోళమే కారణమని తాజాగా ఈ వెబ్సైట్ వెల్లడించింది. ప్రజల్లో జాతిపిత గాంధీ నేతాజీ మరణంపై లేనిపోని గందరగోళం రేపారని అందువల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని సదరు వెబ్సైట్ కథనం వెలువరించింది.
Read more: నేతాజీ చివరి రోజుల మిస్టరీపై వెబ్సైట్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నెలకొన్న మిస్టరీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నెలకొన్న మిస్టరీ ఇప్పటివరకు వీడలేదనే విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో నేతాజీ మరణానికి సంబంధించిన వివరాలు, మిస్టరీ వెనకున్న విషయాలను బయటకు రప్పించడానికి ఇటు ప్రభుత్వాలు, అటు ఇతర సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

నేతాజీ మరణంపై మహాత్మాగాంధీజీ గందరగోళం
ఈ నేపథ్యంలో నేతాజీ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలపై ఆధారాలను విడుదల చేస్తున్న ఓ బ్రిటన్ వెబ్ సైట్ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వివరించింది.సదరు వెబ్ సైట్ కథనం ప్రకారం .. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై మహాత్మాగాంధీజీ గందరగోళం సృష్టించారని తెలుస్తోంది.

బోస్ మరణించినట్లు చెబుతున్న ఐదు నెలలకు
అసలు విషయంలోకి వెళితే .. తైవాన్ లో విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు చెబుతున్న ఐదు నెలలకు, అంటే 1946 జనవరిలో గాంధీజీయే స్వయంగా బోస్ బ్రతికే ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు చెప్పారని, దీంతో మహాత్ముడే ఇలా మాట్లాడటంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని సదరు వెబ్ సైట్ తెలియజేసింది.

ఆ తర్వాత అదే సంవత్సరం మార్చిలో గాంధీజీ
అంతేకాకుండా ఆ తర్వాత అదే సంవత్సరం మార్చిలో గాంధీజీ 'హరిజన్' అనే పత్రికలో .. నేతాజీ బ్రతికే ఉన్నట్లు తన అంతర్బుద్ధికి అనిపించడం వల్ల అలా మాట్లాడానని ఆ పత్రికలో వెలువరించారు.

తాను చేసిన వ్యాఖ్యలను అందరూ మరచిపోవాలని
తాను చేసిన వ్యాఖ్యలను అందరూ మరచిపోవాలని, తమకు కనిపించే ఆధారాలనే నమ్మాలని, అలాగే నేతాజీ మనల్ని విడిచి వెళ్లిపోయారన్న యదార్థాన్ని గ్రహించాలని, దేశం కోసం నేతాజీ తన ప్రాణాలను అర్పించారని పేర్కొంటూ ఆ పత్రికలో రాశారని వెల్లడించింది.

నేతాజీ మరణంపై మహాత్మాగాంధీజీ
ఈ విధంగా నేతాజీ మరణంపై మహాత్మాగాంధీజీ గందరగోళం సృష్టించారని సదరు వెబ్ సైట్ పేర్కొంది.

జనవరి 23 1947 నేతాజీ పుట్టిన రోజు సందర్భంగా
ఇక జనవరి 23 1947 నేతాజీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ నేతాజీ గురించి మాట్లాడుతూ దేశ సేవకే తన ప్రాణాలను అర్పించాడని తన జీవితం మొత్తం దేశానికే ధారపోసాడని ప్రశంసించారు.

అయితే ఈ కథనం నేతాజీ విమాన ప్రమాదంలోనే
అయితే ఈ కథనం నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయారనే వాదనలకు మరింతగా బలమిస్తోంది. మరి నిజనిజాలు తెలియాల్సి ఉంది.

నేతాజీ మరణం వెనుక ఏం జరిగింది

ఈ ఫోన్ని 800 ఏళ్ల క్రితం ఏలియన్స్ వదిలివెళ్లారట
ఈ ఫోన్ని 800 ఏళ్ల క్రితం ఏలియన్స్ వదిలివెళ్లారట..ఆసక్తికర కథనం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://telugu.gizbot.com/news/an-800-year-old-mobile-phone-was-has-been-found-with-cuneifo-013034.html


Click it and Unblock the Notifications








