వొడాఫోన్ దుమ్మురేపింది
తమ వినియోగదారుల కోసం అధికడేటాను ఉచితంగా అందించనుంది. వివిధ రకాల ప్లాన్లపై ఈ అపరిమిత కాలింగ్ 4జీ డేటాను ఆఫర్ చేస్తోంది.
టెలికం రంగంలో జియోని తట్టుకుని నిలబడేందుకు ప్రముఖ టెల్కో దిగ్గజం వొడాఫోన్ తన రీఛార్జ్ పథకాలను మరోసారి అప్ డేట్ చేసింది.ఇటీవలే పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం అన్ లిమిటెడ్ ఆఫర్లను ప్రకటించింది. దీంతో పాటు ఇప్పుడు తమ వినియోగదారుల కోసం అధికడేటాను ఉచితంగా అందించనుంది. వివిధ రకాల ప్లాన్లపై ఈ అపరిమిత కాలింగ్ 4జీ డేటాను ఆఫర్ చేస్తోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ లో భాగంగా మరో మూడు కొత్త ప్లాన్స్ ప్రకటించింది.

రూ. 1699 ల రీచార్జ్ పై
రూ. 1699 ల రీచార్జ్ పై హోం నెట్వర్క్ లో ఉచిత కాలింగ్ , 20జీబీ 4జీలేదా 3 జీ డేటా అందిస్తోంది. అదే నాన్ 4జీ మొబైల్స్ పై 16 జీబీ 3 జీ డేటాను అందిస్తోంది , అన్ లిమిటెడ్ కాల్స్, (లోకల్ అండ్ ఎస్టీడీ) అలాగే రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ.

రూ.2,999 రీచార్జ్ పై
రూ.2,999 రీచార్జ్ పై 4జీ స్మార్ట్ ఫోన్లపై 40జీబీ 3జీ/4జీ డాటా , నాన్ -4జీ స్మార్ట్ ఫోన్లపై 10జీబీ డాటా ఉచితం

రూ. 1999ల రీచార్జ్ పై
రూ. 1999ల రీచార్జ్ పై 20 జీబీ నాన్ 4 జీ డాటా, 24 జీబీ 4 జీబీ డాటా ఉచితం. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్..100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ.

రూ. 499 లకు
రూ. 499 లకు లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1 జీబీ డాటా నాన్ 4 జీ మొబైల్స్ కు , 4 జీ మొబైల్స్ లో 3 జీబీ లేదా 4 జీ డాటా,100 ఎస్ఎంఎస్ లు ఉచితం.

రూ. 699 లకు
రూ. 699 లకు లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 5 జీ.బీ. 4 జీ లేదా 2.5 జీబీ డాటా 100 ఎస్ఎంఎస్ లను ఉచితం.

రెండు ప్లాన్స్ మాత్రమే
కింద రెండు ప్లాన్స్ మాత్రమే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఝార్ఖండ్, జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సర్కిల్సో అమలవుతాయని పేర్కొంది. అయితే వివిధ సర్కిల్స్ లో ఈ ధరల్లో తేడా ఉండొచ్చని తెలిపింది. డేటా పరిమితి దాటిన తరువాత ఒక ఎంబీకి 50పైసలు చార్జ్ చేయనున్నట్టు చెప్పింది.


Click it and Unblock the Notifications








