నాలుగు స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించిన షియోమి

|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఈ ఏడాది ప్రారంభంలో రెడ్‌మి నోట్ 7 సిరీస్ - రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7 మరియు రెడ్‌మి నోట్ 7S లను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 7 సిరీస్‌ను అనుసరించి కంపెనీ రెడ్‌మి Y3 మరియు రెడ్‌మి7 లను కూడా ఇండియాలో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7S, రెడ్‌మి 7, రెడ్‌మి Y3 ఫోన్ల అమ్మకాలు మొదలై చాలా రోజులు అయింది.

Xiaomi reduced the prices of Four Smartphones in India:Know The New Price Details Here

ఇప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నందున షియోమి సంస్థ తన నాలుగు స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించాలి అని భావించింది. అందుకు తగ్గట్టుగా షియోమి సంస్థ ఈ రెడ్‌మి ఫోన్‌ల ఇండియా ధరను 1,000 రూపాయల వరకు తగ్గించారు. రెడ్‌మి అధికారికంగా తన రెడ్‌మి నోట్ 8 సిరీస్‌ను రిలీజ్ చస్తున్నందున వీటి యొక్క ధరలను తగ్గిస్తోంది.

ఆఫ్‌లైన్ మార్కెట్లలో:

ఆఫ్‌లైన్ మార్కెట్లలో:

రెడ్‌మి నోట్ 7 ప్రో,రెడ్‌మి నోట్ 7S, రెడ్‌మి 7 మరియు రెడ్‌మిY3 యొక్క తగ్గిన ధర ఆఫ్‌లైన్ మార్కెట్లలో మాత్రమే ఉండటం గమనించదగిన విషయం. కొత్త ధరలు ఆగస్టు 20 నుండి ఆఫ్‌లైన్ మార్కెట్లో వర్తిస్తాయి. కాబట్టి వినియోగదారులు Mi హోమ్ స్టోర్ లేదా Mi యొక్క భాగస్వాముల ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తే వారు తక్కువ ధరలకు ఫోన్‌లను పొందవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్‌లలో కొన్ని వేరియంట్‌లకు మాత్రమే ధర తగ్గింపు లభించిందని గమనించాలి.

 రెడ్‌మి నోట్ 7 ప్రో:

రెడ్‌మి నోట్ 7 ప్రో:

రెడ్‌మి నోట్ 7 ప్రో యొక్క 6GB ర్యామ్ మోడల్‌కు భారత ఆఫ్‌లైన్ మార్కెట్లో ధర తగ్గింపు లభించింది. ఇంతకుముందు రెడ్‌మి నోట్ 7 ప్రో 6GB ర్యామ్ మోడల్ 15,999 రూపాయలకు అమ్ముడైంది. ఇప్పుడు 1,000 రూపాయల తగ్గింపు పొందిన తరువాత ఈ ఫోన్ 14,999 రూపాయలకు లభిస్తున్నది.

రెడ్‌మి 7:

రెడ్‌మి 7:

రెడ్‌మి 7 యొక్క రెండు వేరియంట్‌లకు భారతదేశంలో 500 రూపాయల ధర తగ్గింపు లభించింది. ధర తగ్గింపు తరువాత రెడ్‌మి 7 యొక్క 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ 7,499 రూపాయలకు మరియు 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ 8,499 రూపాయలకు వస్తుంది. ఇంతకుముందు రెడ్‌మి 7 యొక్క 2 GB ర్యామ్ మోడల్ ధర రూ .7,999 కాగా, 3 GB ర్యామ్ వెర్షన్ రూ .8,999 కు అమ్ముడైంది.

రెడ్‌మి Y3:

రెడ్‌మి Y3:

రెడ్‌మి Y3 యొక్క 3 GB ర్యామ్ + 32 GB స్టోరేజ్ మోడల్‌కు భారతదేశంలో 1000 రూపాయల తగ్గింపు పొందింది. ఫోన్ యొక్క ఈ మోడల్ ఇప్పుడు అసలు ధర 9,999 రూపాయలకు బదులుగా ఇప్పుడు 8,999 రూపాయలకు అందుబాటులో ఉంది.

రెడ్‌మి నోట్ 7S:

రెడ్‌మి నోట్ 7S:

రెడ్‌మి నోట్ 7S యొక్క రెండు వేరియంట్‌లకు భారతదేశంలో ధర తగ్గింపు లభిస్తుంది. ధర తగ్గిన తరువాత రెడ్‌మి నోట్ 7S యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో 9,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే ఇందులో టాప్-ఎండ్ మోడల్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు 11,999 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ స్టోర్స్‌లో షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7S, రెడ్‌మి 7, రెడ్‌మి Y3 ధర ముందు ఉన్న ధర వద్దే అమ్మకాలు జరుగుతున్నాయి.

 

Best Mobiles in India

English summary
Xiaomi reduced the prices of Four Smartphones in India:Know The New Price Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X