Home
News

నాలుగు స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించిన షియోమి

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఈ ఏడాది ప్రారంభంలో రెడ్‌మి నోట్ 7 సిరీస్ - రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7 మరియు రెడ్‌మి నోట్ 7S లను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 7 సిరీస్‌ను అనుసరించి కంపెనీ రెడ్‌మి Y3 మరియు రెడ్‌మి7 లను కూడా ఇండియాలో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7S, రెడ్‌మి 7, రెడ్‌మి Y3 ఫోన్ల అమ్మకాలు మొదలై చాలా రోజులు అయింది.

Xiaomi reduced the prices of Four Smartphones in India:Know The New Price Details Here

ఇప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నందున షియోమి సంస్థ తన నాలుగు స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించాలి అని భావించింది. అందుకు తగ్గట్టుగా షియోమి సంస్థ ఈ రెడ్‌మి ఫోన్‌ల ఇండియా ధరను 1,000 రూపాయల వరకు తగ్గించారు. రెడ్‌మి అధికారికంగా తన రెడ్‌మి నోట్ 8 సిరీస్‌ను రిలీజ్ చస్తున్నందున వీటి యొక్క ధరలను తగ్గిస్తోంది.

ఆఫ్‌లైన్ మార్కెట్లలో:

ఆఫ్‌లైన్ మార్కెట్లలో:

రెడ్‌మి నోట్ 7 ప్రో,రెడ్‌మి నోట్ 7S, రెడ్‌మి 7 మరియు రెడ్‌మిY3 యొక్క తగ్గిన ధర ఆఫ్‌లైన్ మార్కెట్లలో మాత్రమే ఉండటం గమనించదగిన విషయం. కొత్త ధరలు ఆగస్టు 20 నుండి ఆఫ్‌లైన్ మార్కెట్లో వర్తిస్తాయి. కాబట్టి వినియోగదారులు Mi హోమ్ స్టోర్ లేదా Mi యొక్క భాగస్వాముల ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తే వారు తక్కువ ధరలకు ఫోన్‌లను పొందవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్‌లలో కొన్ని వేరియంట్‌లకు మాత్రమే ధర తగ్గింపు లభించిందని గమనించాలి.

 రెడ్‌మి నోట్ 7 ప్రో:

రెడ్‌మి నోట్ 7 ప్రో:

రెడ్‌మి నోట్ 7 ప్రో యొక్క 6GB ర్యామ్ మోడల్‌కు భారత ఆఫ్‌లైన్ మార్కెట్లో ధర తగ్గింపు లభించింది. ఇంతకుముందు రెడ్‌మి నోట్ 7 ప్రో 6GB ర్యామ్ మోడల్ 15,999 రూపాయలకు అమ్ముడైంది. ఇప్పుడు 1,000 రూపాయల తగ్గింపు పొందిన తరువాత ఈ ఫోన్ 14,999 రూపాయలకు లభిస్తున్నది.

రెడ్‌మి 7:

రెడ్‌మి 7:

రెడ్‌మి 7 యొక్క రెండు వేరియంట్‌లకు భారతదేశంలో 500 రూపాయల ధర తగ్గింపు లభించింది. ధర తగ్గింపు తరువాత రెడ్‌మి 7 యొక్క 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ 7,499 రూపాయలకు మరియు 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ 8,499 రూపాయలకు వస్తుంది. ఇంతకుముందు రెడ్‌మి 7 యొక్క 2 GB ర్యామ్ మోడల్ ధర రూ .7,999 కాగా, 3 GB ర్యామ్ వెర్షన్ రూ .8,999 కు అమ్ముడైంది.

రెడ్‌మి Y3:

రెడ్‌మి Y3:

రెడ్‌మి Y3 యొక్క 3 GB ర్యామ్ + 32 GB స్టోరేజ్ మోడల్‌కు భారతదేశంలో 1000 రూపాయల తగ్గింపు పొందింది. ఫోన్ యొక్క ఈ మోడల్ ఇప్పుడు అసలు ధర 9,999 రూపాయలకు బదులుగా ఇప్పుడు 8,999 రూపాయలకు అందుబాటులో ఉంది.

రెడ్‌మి నోట్ 7S:

రెడ్‌మి నోట్ 7S:

రెడ్‌మి నోట్ 7S యొక్క రెండు వేరియంట్‌లకు భారతదేశంలో ధర తగ్గింపు లభిస్తుంది. ధర తగ్గిన తరువాత రెడ్‌మి నోట్ 7S యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో 9,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే ఇందులో టాప్-ఎండ్ మోడల్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు 11,999 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ స్టోర్స్‌లో షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7S, రెడ్‌మి 7, రెడ్‌మి Y3 ధర ముందు ఉన్న ధర వద్దే అమ్మకాలు జరుగుతున్నాయి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi reduced the prices of Four Smartphones in India:Know The New Price Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X