GST దెబ్బకు ఐఫోన్ ధరలు తగ్గాయ్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరల్ని తగ్గించింది.
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరల్ని తగ్గించింది. ఐఫోన్ల పాతధరలతో పోలిస్తే వివిధ మోడల్స్పై దాదాపు 7.2 శాతం వరకూ ధరలు తగ్గాయి. ఐఫోన్ 7ప్లస్ (256 జీబీ) ప్రస్తుతం రూ. 85,400కు లభిస్తుంది. దీని పాత ధర రూ. 92,000.

అలాగే ఐఫోన్ ఎస్ఈ (128 జీబీ) ధర రూ. 2,200 తగ్గుదలతో రూ. 35,000కు దిగింది. 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ (512 జీబీ) ధర రూ. లక్ష నుంచి రూ. 97,000కు కట్ చేసింది. జూలై 1 నుంచి ధరల్ని తగ్గిస్తూ కొత్త ధరల్ని కంపెనీ వెబ్సైట్లో పొందుపర్చారు. జీఎస్టీ కారణంగానే ధరలు తగ్గించారా అంటూ కంపెనీని వివరణ కోరగా, వ్యాఖ్యానించేందుకు ఆపిల్ నిరాకరించింది. ఐఫోన్ ఎస్ఈ ఫీచర్స్ ఇవే...

4 అంగుళాల రెటీనా డిస్ప్లే
ఐఫోన్ 5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్ను ఆపిల్ పొందుపరిచింది.4 అంగుళాల రెటీనా డిస్ప్లే

ఆపిల్ ఏ9 సాక్
ఆపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్

కెమెరా
ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం,12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్),

4జీ ఎల్టీఈ సపోర్ట్
1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్ 4.2, వై-ఫై కనెక్టువిటీ, సరికొత్త మైక్రోఫోన్ వ్యవస్థ

ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఆపిల్ పే సపోర్ట్ విత్ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.రోజ్ గోల్డ్ సహా ఇతర కలర్ వేరియంట్స్ లో ఐఫోన్ ఎస్ఇ లభిస్తోంది.


Click it and Unblock the Notifications








