ఐటెల్ 4జీ ఫోన్ రూ. 5,840కే !
చైనీస్ మొబైల్ దిగ్గజం ఐటెల్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.
చైనీస్ మొబైల్ దిగ్గజం ఐటెల్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. విష్ ఎ41 పేరుతో ఈ మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.5,840 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.
ఈ ఫోన్ లో మల్టీ అకౌంట్ రన్ చేయవచ్చు.
సోనీ 4జీబి ర్యామ్ మొబైల్ని దించుతోంది

ఒకేసారి రెండు డిఫరెంట్ అకౌంట్లను లాగిన్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఫోన్ లో ఉన్న స్మార్ట్ కీ ద్వారా వాట్సప్, ఫేస్ బుక్ రెండు ఒకేసారి ఒపెన్ చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ డిస్ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ ఉంది.
జియో ధరలతో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది !

ర్యామ్ విషయానికొస్తే 1 జీబీ ర్యామ్ తో పాటు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్ సపోర్ట్. కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా తో పాటు2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. 4జీ వీవోఎల్టీఈ, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications