రూ.500కే స్మార్ట్ఫోన్, రేపే విడుదల
నోయిడాకు చెందిన దేశవాళీ మొబైల్ ఫోన్ల తయీరీ కంపెనీ రింగింగ్ బెల్స్ (Ringing Bells) భారత్లోనే అత్యంత చవకైన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫ్రీడమ్ 251 (Freedom 251) పేరుతో రాబోతున్న ఈ ఫోన్ ధర రూ.500 మాత్రమే. ఫిబ్రవరి 17 తేదీన నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో భాగంగా ఈ ఫోన్ను యూనియన్ డిఫెన్స్ మంత్రి మనోహర్ పర్రీకర్ విడుదల చేస్తారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్... మన భవిష్యత్ ఇదే

గతంలో రింగింగ్ బెల్స్ నుంచి Bell 101 4జీ సపోర్ట్ ఫోన్ (రూ.2,999), Bell Master (రూ.999), Bell 4U (రూ.799)లు మార్కెట్లో విడుదలయ్యాయి. ప్రధాన మంత్రి ఆశయాలకు అనుగుణంగా ఈ ఫోన్ను విడుదల చేస్తున్నట్లు రింగింగ్ బెల్స్ తెలిపింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవిడిభాగాలతో ఫోన్లను అసెంబ్లింగ్ చేసిన రింగింగ్ బెల్స్ విక్రయిస్తోంది. మేక్ ఇండియన్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే ఉత్పత్తులను తయారీని ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








