Airtel పేమెంట్స్ బ్యాంక్లో భారీగా పెరిగిన యాక్టివ్ యూజర్ల సంఖ్య..
భారతీ ఎయిర్టెల్ టెలికాం సంస్థ యొక్క బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ బిజినెస్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఘనతను పొందింది. ఇప్పుడు ఇది 15 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. దీని యొక్క ఆన్లైన్ బ్యాంక్ సేవలు మొదట ఏప్రిల్ 11, 2016 న భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో పేమెంట్ బ్యాంక్ను వినియోగదారులకు మరింత సురక్షితమైనదిగా మరియు వేగవంతమైనదిగా మార్చడానికి ఎయిర్టెల్ అధికంగా పెట్టుబడులను పెట్టింది.

ఇటీవల ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తమ వినియోగదారుల కోసం వారు చేసే ఆన్లైన్ పేమెంట్లపై రివార్డులను సంపాదించడంలో సహాయపడటానికి ‘రివార్డ్స్ 123' సేవింగ్స్ అకౌంటును అధికారికంగా ప్రారంభించింది. సాధారణ సేవింగ్స్ అకౌంట్ నుండి రివార్డ్స్ 123 అకౌంటుకు అప్గ్రేడ్ చేయడానికి వినియోగదారులు సంవత్సరానికి రూ.299ల నామమాత్రపు రుసుమును చెల్లించాలి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు, టైర్ -2, మరియు టైర్ -3 నగరాల్లో మంచి పురోగతిని సాధించినట్లు భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఇటీవల తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ పేమెంట్స్ లో 9నెలలో పెరిగిన వినియోగదారుల చేరిక
ఎయిర్టెల్ పేమెంట్స్ మొదలైన తరువాత చాలాసార్లు తక్కువ మంది చేరికను కలిగి ఉంది. అయితే ఇప్పుడు చేరిక గణనీయంగా పెరిగింది అని మిట్టల్ చెప్పారు. భారతీయ వ్యాపార 2003-04 కాలంలో ఎయిర్టెల్ దాదాపుగా మూసివేసిన తరువాత 2016 లో జియో తన ఉచిత సేవలు మరియు సబ్సిడీ ప్లాన్ లతో టెలికాం మార్కెట్ను దెబ్బతీసినప్పుడు అనేక కంపెనీలు దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. అన్ని కష్టాల మధ్య నుంచి కూడా ఎయిర్టెల్ బయటపడింది. అలాగే ఎయిర్టెల్ మార్కెట్ వాటా, బ్రాండ్ ఇండెక్స్ మరియు బ్రాండ్ విధేయతను కూడా పెంచుకోగలిగింది. గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా ఎయిర్టెల్ పోటీ ప్రపంచంలో జియో కంటే ఎక్కువ మంది సభ్యులను చేర్చుకుంటోందని మిట్టల్ తెలిపారు. కస్టమర్లను నిర్వహించడంలో మరియు బలమైన నెట్వర్క్ అనుభవాన్ని అందించడంలో టెల్కో అసాధారణమైనది.

‘మరణానికి దగ్గరైన అనుభవాలను' చవిచూసినప్పటికీ ఎయిర్టెల్ ప్రస్తుతం చాలా ఆరోగ్యకరమైన స్థితిలో ఉందని మిట్టల్ చెప్పారు. గత నాలుగైదు సంవత్సరాల్లో ఎయిర్టెల్ సుమారు 12 బిలియన్ డాలర్ల వరకు సేకరించగలిగింది. ఇది కష్టతరమైన కాలాలలో ఒకటి అయినప్పటికీ అతను గర్వపడ్డాడు. ఎయిర్టెల్ యొక్క నిబద్ధత మరియు విశ్వసనీయత టెల్కోకు ఈ డబ్బును సేకరించడానికి అనుమతించాయని మిట్టల్ అభిప్రాయపడ్డారు.

భారతి ఎయిర్టెల్ ఇటీవల ఒక కొత్త కంపెనీ నిర్మాణానికి శ్రీకారం సృష్టించింది. దీనిలో టెలికాం వ్యాపారం, సంస్థ యొక్క అన్ని డిజిటల్ ఆస్తులతో పాటు, భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ పరిధిలోకి వచ్చింది. ఏదేమైనా ఎయిర్టెల్ ప్రెమెంట్స్ బ్యాంక్ టెలికాం వ్యాపారం నుండి ఒక ప్రత్యేక సంస్థగా మిగిలిపోతుంది మరియు రాబోయే సంవత్సరాల్లో భారత ప్రజలకు ఇ-ఫైనాన్స్ సేవలను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.


Click it and Unblock the Notifications