టెల్కోల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

|

ఇండియా యొక్క టెలికామ్ రంగంలో అన్ని టెల్కోలు తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో పెంపును ప్రకటించడం ద్వారా వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్టెల్ అడుగుజాడల్లో రిలయన్స్ జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను పెంచింది.

ప్రీపెయిడ్ ప్లాన్‌

ముంబయికి చెందిన టెల్కో తన కొత్త 'ఆల్ ఇన్ వన్' ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద 40 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త ధరలతో జియో యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ డిసెంబర్ 6, శుక్రవారం నుండి మార్కెట్ లో అమల్లోకి వస్తాయి. అయితే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

జియో

రిలయన్స్ జియో యొక్క కొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పాత వాటి కంటే 40 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపాయి. ధరలు అధికంగా ఉన్నప్పటికీ అవి ముందు వాటి కంటే 300 శాతం వరకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులకు అధిక ప్రయోజనం చేకూర్చడం మరియు డేటా వినియోగం లేదా డిజిటల్ స్వీకరణలో వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయని మరియు పెట్టుబడులను కొనసాగించే విధంగా సుంకాల పెరుగుదలలో తగిన చర్యలు తీసుకున్నాము అని జియో సంస్థ పత్రిక విలేఖరులకు తెలిపింది.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 2019: ఆఫర్స్ ఒకసారి చూసేయండిఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 2019: ఆఫర్స్ ఒకసారి చూసేయండి

జియో

జియో అక్టోబర్‌ నెలలో జియోయేతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయడానికి ఆఫ్‌నెట్ ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) నిమిషాలను అందించడానికి రూ. 222, రూ. 333, మరియు రూ.444 ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఆ సమయంలో ఆపరేటర్లు కొత్త ప్లాన్‌లు పోటీ నుండి ప్రస్తుతం ఉన్న ప్లాన్‌ల కంటే 20 నుండి 50 శాతం చౌకగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా రూ.149 జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఇటీవల జియోయేతర వాయిస్ కాలింగ్ కోసం 300 నిమిషాలతో అప్డేట్ ను అందుకుంది కాని దాని యాక్సిస్ సమయం 28 రోజుల నుండి 24 రోజులకు తగ్గించింది.

 

Google Pay On Air feature: RS.1,000లు పొందవచ్చు ఎలాగో తెలుసుకోండి!!Google Pay On Air feature: RS.1,000లు పొందవచ్చు ఎలాగో తెలుసుకోండి!!

వోడాఫోన్

గత నెలలో జియో సంస్థ కూడా వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్‌లను అనుసరించి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇద్దరు ఆపరేటర్లకు కలుపుకొని సెప్టెంబర్ 2019 తో ముగిసిన త్రైమాసికంలో రూ.74,000 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది.

 

Mi క్రెడిట్ సర్వీసును Dec 3 న ప్రారంభిస్తున్న షియోమిMi క్రెడిట్ సర్వీసును Dec 3 న ప్రారంభిస్తున్న షియోమి

జియో ఆపరేటర్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఆపరేటర్ అక్టోబర్లో వరుసగా ఎనిమిదవ లాభదాయక త్రైమాసికాన్ని అందుకుంది. ఈ సంవత్సరం దాని లాభం రూ. 990 కోట్లు. గత ఏడాది యొక్క లాభం 681 కోట్లు దీనితో పోలిస్తే సంవత్సరానికి (YOY) 45 శాతం పైగా పెరుగుదలను అందుకున్నది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో ప్రకటించిన ఆదాయంలో జియో యొక్క చందాదారుల సంఖ్య 331.3 మిలియన్ల సభ్యుల ప్రస్తుతం 355.2 మిలియన్ల మంది సభ్యుల మార్కును తాకింది.

వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా తను సవరించిన కొత్త ప్రీపెయిడ్ ధరలను డిసెంబర్ 3 మంగళవారం నుండి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కొత్త అప్డేట్ ప్రకారం వోడాఫోన్ యొక్క ప్లాన్లు రూ.149 నుండి మొదలై రూ.2,399 వరకు ఉంటాయి. ఇంకా టెల్కో అందిస్తున్న అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అతి తక్కువ ధరలో రూ.19ల ప్లాన్ వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 150 ఎమ్‌బి డేటా వంటి ప్రయోజనాలను రెండు రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది.

ఎయిర్‌టెల్

అదేవిధంగా ఎయిర్‌టెల్ యొక్క కొత్త టారిఫ్ ప్లాన్ల ధరలు మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఎయిర్‌టెల్ యొక్క కొత్త ప్లాన్లు రూ.19 నుండి రూ.1,699ల మధ్య ఉంటాయి. పాత ప్లాన్లతో పోలిస్తే కొత్త ప్రణాళికల ద్వారా వినియోగదారుడు రోజుకు 50 పైసల నుంచి రూ. 2.85 వరకు అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel, Vodafone, Jio Hike Prepaid Plan Prices Up to 40 Percent

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X