Bharti Airtel వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లాంచ్ త్వరలోనే...
ప్రపంచం మొత్తం మీద COVID-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు కేవలం వారి యొక్క ఇంటికి మాత్రమే పరిమితం అయ్యి వారి యొక్క అన్ని రకాల పనులను పూర్తిచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇటువంటి వారు తమ యొక్క గ్రూప్ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువగా వీడియో-కాన్ఫరెన్సింగ్ వంటి సేవలను వినియోగిస్తున్నారు.

వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్
వీడియో కాలింగ్ సేవలకు ఎక్కువ డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో భారతి ఎయిర్టెల్ కొత్తగా తన వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను ప్రారంభించనున్నది.

ఎయిర్టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్
ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎయిర్టెల్ తన వినియోదారులకు అద్భుతమైన డేటా ప్రయోజనాలను అందిస్తున్నది. దీనితో పాటుగా బ్రాడ్బ్యాండ్ రంగంలో కూడా గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. ఇప్పుడు కొత్తగా వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసే ఆలోచనలలో ఉంది. కాకపోతే ప్రారంభంలో ఎయిర్టెల్ సంస్థ తన బ్రాండెడ్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను కేవలం కంపెనీలకు మాత్రమే అందించనున్నది. తరువాత దాని యొక్క డిమాండ్ను అంచనా వేసిన తర్వాత సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది.

ఇండియా మార్కెట్లో వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీసులు
ప్రస్తుతం ఎక్కువగా వీడియో-కాన్ఫరెన్సింగ్ కోసం జూమ్, గూగుల్ హ్యాంగ్అవుట్, మైక్రోసాఫ్ట్ టీమ్ వంటి యాప్ లను వాడుతున్నారు. వీటికి పోటీగా గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ తన జియోమీట్ వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసింది. ఈ జియోమీట్ యాప్ గరిష్టంగా 100మంది ఒకే సారి మీటింగులో పాల్గొనడానికి అనుమతిని ఇస్తుంది.

ఎయిర్టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ ఫీచర్స్
సైబర్ భద్రతా బెదిరింపులపై ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఎయిర్టెల్ డేటా స్థానికీకరణ మరియు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ యొక్క వీడియో-కాన్ఫరెన్సింగ్ ఉత్పత్తి అధిక స్థాయి భద్రతపై దృష్టి సారించింది. ప్రజలు ఇంటి నుండి పనిచేసేటప్పుడు సైబర్ భద్రత గురించి ఆందోళన చెందకుండా ఉండే విధంగా తయారుచేస్తున్నది. దీని యొక్క వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ మొబైల్ మరియు డెస్క్టాప్లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








