BSNL బ్రాడ్బ్యాండ్ యూజర్లకు గుడ్ న్యూస్!! సరసమైన ప్లాన్ల లభ్యత 90 రోజులకు పొడగింపు
బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ టెల్కో సంస్థ బ్రాడ్బ్యాండ్ రంగంలో కూడా భారత్ ఫైబర్ పేరుతో సరసమైన ధరల వద్ద కూడా బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల అందిస్తున్నాయి. ఇప్పుడు తన యొక్క యూజర్ బేస్ ను పెంచుకోవడానికి 2021 సంవత్సరం మొదటిలో సరసమైన ధరల వద్ద లభించే ప్లాన్ల యొక్క లభ్యతను మరో 90 రోజులు పొడిగించింది. తాజా సమాచారం ప్రకారం రూ.449, రూ.799, రూ.999 మరియు రూ.1,499 ధరల వద్ద లభించే భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల మీద 2021 జనవరి 4 నుండి మరో 90 రోజుల చందాను అదనంగా పొందవచ్చు.

బిఎస్ఎన్ఎల్ సంస్థ 2020 అక్టోబర్ 1 న ఈ ప్లాన్లను 90 రోజుల ప్రచార ప్రాతిపదికన ప్రవేశపెట్టింది. ప్రస్తుత సమయంలో చందాదారులు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) నుండి ఈ కొత్త సమర్పణలకు వలసపోతున్న సందర్భంలో అక్టోబర్ నెలలో బిఎస్ఎన్ఎల్ చందాదారుల నష్టాన్ని 50,000 కు తగ్గించింది. పైన పేర్కొన్న నాలుగు భారత్ ఫైబర్ ప్లాన్లు జియోఫైబర్ మరియు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లకు అనుగుణంగా డేటాను అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారత్ ఫైబర్ ప్లాన్స్ లభ్యత పొడిగింపు
రూ.449 ధర వద్ద లభించే బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బేసిక్ ప్లాన్ 30Mbps వేగంతో 3.3TB FUP పరిమితి డేటా మరియు FUP డేటా తరువాత డేటా స్పీడ్ 2Mbpsకు తగ్గించబడుతుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ సర్వీస్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను 30 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. రూ.499 భారత్ ఫైబర్ బేసిక్ ప్లాన్ కొత్త కస్టమర్లకు మాత్రమే లభిస్తుందని గమనించండి.

భారత్ ఫైబర్ ప్రీమియం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ వివరాలు
రూ.799 ధర వద్ద లభించే భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అకా ఫైబర్ వాల్యూ 799 వినియోగదారులకు 100Mbps వేగంతో 3.3TB FUP పరిమితి డేటాను అందిస్తుంది. ఈ FUP పరిమితి తర్వాత డేటా స్పీడ్ 2Mbps కు తగ్గించబడుతుంది. వినియోగదారులకు అదనంగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అలాగే ఫైబర్ ప్రీమియం పేరుతో రూ.999 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు 200Mbps అప్లోడ్ & డౌన్లోడ్ వేగంతో 3.3TB వరకు డేటాను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. దీని తరువాత డేటా స్పీడ్ 2Mbpsకు తగ్గించబడుతుంది.

భారత్ ఫైబర్ అల్ట్రా ప్లాన్ వివరాలు
భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ చివరగా రూ.1,499 ధర వద్ద అందించే భారత్ ఫైబర్ అల్ట్రా ప్లాన్ వినియోగదారులకు 300Mbps వేగంతో 3.3TB ఎఫ్యుపి పరిమిత డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత ల్యాండ్లైన్ వాయిస్ కాల్ల ప్రయోజనంను కూడా అందిస్తుంది. రూ.449 ప్లాన్ కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా మిగిలిన ప్లాన్లను ప్రస్తుత వినియోగదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.999 మరియు రూ.1,499 ధర వద్ద లభించే ప్లాన్ల మీద డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నాయి.

భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల నిబంధనలు
భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల యొక్క నిబంధనలు మరియు షరతుల విషయానికి వస్తే పైన పేర్కొన్న ప్లాన్లు GSTకి ప్రత్యేకమైనవి. ప్రతి యూజర్ రూ.449 ప్లాన్ను కేవలం ఆరు నెలలు మాత్రమే పొందవచ్చు. ఆ తర్వాత వినియోగదారులు రూ.599 ఫైబర్ బేసిక్ ప్లస్ లేదా ఇతర ఎఫ్టిటిహెచ్ ప్లాన్కు అప్గ్రేడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆటోమేటిక్ ప్లాన్ మార్పు గురించి వినియోగదారులకు దరఖాస్తు సమయంలోనే తెలియజేయబడుతుంది.


Click it and Unblock the Notifications








