వారం రోజులపాటు బిఎస్ఎన్ఎల్ ఉచిత సేవలు
భారీ వర్షాలతో విలవిలలాడుతున్న చెన్నై వాసులకు సెల్ ఫోన్ సంస్థలు ఉచిత సదుపాయాన్ని అందిచేందుకు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. ఎయిర్ టెల్ ప్రీ టాక్ టైం ఇచ్చిన వెంటనే ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఏకంగా వారం రోజుల పాటు ఉచిత సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది.
Read more: ఎయిర్టెల్ సాహసం : చెన్నై వాసులకు ఉచిత టాక్ టైం

వారం రోజుల పాటు చెన్నై వాసులు ఎటువంటి ఛార్జీ చెల్లించకుండా టాక్ టైం పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రకటన చేశారు. వారం రోజుల పాటు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉచితమెసేజ్ లు అలాగే ఉచిత కాల్స్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
Read more: శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం

జలదిగ్భందంలో చిక్కుకుపోయిన చెన్నైకు ఇలా అందరూ చేయూతనివ్వడం చాలా మంచి పరిణామం. అయితే చెన్నైలో ఇప్పట్లో వర్షాలు తగ్గుముఖం పట్టేలా లేవు. తమిళనాడులో రక్షణ చర్యలు వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

మిలిటరీ ఆర్మీ బలగాలు ఇప్పటికే అక్కడ రంగంలోకి బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








