220రోజుల వాలిడిటీతో BSNL Rs.999 ప్లాన్
దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం అన్ని టెలికాం కంపెనీలు ధరలను పెంచిన తరుణంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశంలో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎక్కువ కాలం యాక్సిస్ ను అందించే కొత్త ప్లాన్ ను ప్రారంభించింది. రూ.999 విలువ గల ఈ కొత్త ప్లాన్ కేవలం కాలింగ్ ప్రయోజనాన్ని 220 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.

దేశంలో ఎక్కువ మంది అధిక డేటాను వినియోగిస్తున్నప్పటికీ వారి కంటే ఎక్కువ శాతంలో తక్కువగా డేటాను వినియోగించే వారు కూడా ఉన్నారు. అలాగే అసలు డేటాను వియోగించని వారు కూడా ఉన్నారు. కేవలం వాయిస్ కాల్స్ చేయడానికి మాత్రం ఇష్టపడే వారు ఎక్కువ మంది ఉన్నందున బిఎస్ఎన్ఎల్ అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని లాంగ్ టర్మ్ వాలిడిటీతో కొత్త ప్లాన్ ను ప్రారంభించింది.

టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచుతున్న సమయంలో చాలా మంది తక్కువ మొత్తంలో డేటాను వినియోగిస్తారు. ఇంతక ముందు అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రాయాజనంతో పాటు అధిక మొత్తంలో డేటాను అందిస్తు ఉండేవారు. ఇప్పుడు వాటి ధరలు భారీగా పెంచిన కారణంగా వినియోగదారులు కేవలం అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రాయాజనం ఉన్న ప్లాన్ లను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. దీనికి మరొక కారణం కూడా ఉంది అధిక మొత్తంలో డేటాను వినియోగించే వారు బ్రాడ్బ్యాండ్ వైపు మగ్గు చూపుతున్నందున టెలికామ్ సంస్థలు అందిస్తున్న మొబైల్ డేటాతో ప్రయోజనంతో ఎటువంటి ఉపయోగం లేదు.

బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న ఈ కొత్త ప్లాన్ రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ పరిమితితో 222 రోజుల పాటు వస్తుంది. వినియోగదారులు డిల్లీ మరియు ముంబై నగరాలతో సహా ఏదైనా నెట్వర్క్కు అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించదని గమనించాలి. ఒక వేల డేటా ప్రయోజనాలు పొందాలనుకుంటున్న వినియోగదారులు ప్రత్యేక ప్యాక్తో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్యాక్ రెండు నెలల పాటు రింగ్బ్యాక్ టోన్ (పిఆర్బిటి) ను ఉచితంగా అందిస్తుంది.

222 రోజుల సుదీర్ఘ చెల్లుబాటు కాలంతో వాయిస్ కాల్ ప్రయోజనాలతో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రణాళికలు ఇంటర్నెట్ను అరుదుగా ఉపయోగించే వారికి అనువైనవి. ప్రస్తుతానికి ఈ కొత్త ప్లాన్ కేరళలోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారత టెలికాం దిగ్గజం ఈ కొత్త రూ.999 ప్లాన్ను దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వినియోగదారులకు విడుదల చేయాలని యోచిస్తోంది. అతి త్వరలో ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అమలుచేయబడుతుంది.

టెలికాం దిగ్గజం కేరళ సర్కిల్లలో రూ.997 మరియు రూ.365 విలువైన కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే ఇప్పుడు కొత్తగా ఈ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.997 విలువైన ప్లాన్ 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది డిల్లీ, ముంబై నగరాలతో సహా ఏ నెట్వర్క్కైనా అపరిమిత కాలింగ్ ను అందిస్తుంది. కాకపోతే ఇందులో రోజుకు 250 నిమిషాల చొప్పున రోజువారీ క్యాపింగ్ ఉంటుంది. రెండు నెలల పిఆర్బిటి, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అపరిమిత డేటాను అందిస్తుంది. ఒక రోజులో 3GB డేటా పరిమితిని దాటిన తర్వాత దీని వేగం 80kbps కి తగ్గుతుంది.


Click it and Unblock the Notifications








