ఫేస్బుక్, వాట్సప్: ఇండియాలో వాడేది ఇవేనట
మన దేశంలో ఎక్కువగా ఈ యాప్స్ వాడుతున్నారు.. ఇండియాలో ఉన్న కోట్లమంది యూజర్ల స్మార్ట్ ఫోన్లలో ఏయే యాప్స్ ఉంటాయి. ఇలాంటి అంశాలపై ఈ మధ్య అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాల్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఇండియాలోని ప్రతి ఒక్కరి స్మార్ట్ పోన్ లలో ఫేస్ బుక్, వాట్సప్ ఈ రెండూ తప్పనిసరిగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.
Read more: రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్... ఇలా ఏ ప్లాట్ఫాం అయినా యూజర్లంతా వాడుతున్న యాప్స్లో 'సోషల్ మీడియా యాప్స్'కు విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. దేశంలో తాజాగా చేపట్టిన సర్వేలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్స్పై ఓ సంస్థ చేపట్టిన సర్వేలో పలు యాప్స్ అగ్ర స్థానాల్లో నిలిచాయి.
Read more: మార్స్ పైకి లేఖ: రూ. 12 లక్షలు ఖర్చు

ఇండియా మొత్తం మీద ఉన్న స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎక్కువగా వాడుతున్న యాప్స్లో 'ఫేస్బుక్', 'వాట్సప్'లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అనంతరం స్థానాలను 'ట్రూ కాలర్, యూసీ బ్రౌజర్'లు దక్కించుకున్నాయి. వీటితోపాటు 'ఎంఎక్స్ ప్లేయర్, ఫ్లిప్కార్ట్, క్యాండీ క్రష్, యాప్ లాక్, నౌక్రి యాప్'లు టాప్ యూజింగ్ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.


Click it and Unblock the Notifications








