Just In
- 3 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 5 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 5 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 6 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
తెలుగు నేలపై నయా మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి వారి నుంచి వేలాది రూపాయలు డిపాజిట్లుగా దండుకుని పరారైన దురదృష్టకర సంఘటన. ఎక్సాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీ పేరుతో నవ్యాంధ్రలోని విశాఖలో ఐటీ కంపెనీ తెరిచిన కిరణ్ అనే వ్యక్తి ఉద్యోగం పేరు చెప్పి ఉద్యోగుల నుంచి వేలాది రూపాయలు డిపాజిట్లుగా తీసుకున్నారు. విశాఖ ఐటీ పార్క్ లోని హిల్ నంబర్ 2లో కంపెనీనీ ఏర్పాటు చేసి అక్కడ ఆరునెలల శిక్షణ ఇస్తామని ఆశచూపాడు.
Read more: ఈ ఉద్యోగానికి రూ.3 కోట్ల వేతనం
ఉద్యోగం వస్తుందనే ఆశతో చాలామంది అతని వలలో పడిపోయి వేలాది రూపాయలు కట్టారు. అయితే శిక్షణ సమయంలో వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోగా శిక్షణ పూర్తవుతున్న తరుణంలో గుట్టు చప్పుడు కాకుండా మాయమయ్యాడు. జరిగిన మోసం గురించి తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అయితే చాలా కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.
Read more: బిల్ గేట్స్కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
చాలా కంపెనీలు ఉద్యోగం ఇచ్చేశాం. త్వరలో ఫోన్ చేస్తాం అని చెప్పి, నెలల తరబడి వెయిటింగ్లో పెట్టి, చివరకు నో చెప్పేసి, విద్యార్థులను రోడ్డున పడేస్తున్నాయి కంపెనీలు. ఇందులో ఎంఎన్ సీ కంపెనీలు కూడా ఉన్నాయి.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
దానికి తోడు కొత్తగా మొదలైన స్టార్టప్ మోజు కూడా విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దేశంలో కొత్తగా చాలా చిన్న కంపెనీలు పుట్టుకువచ్చాయి. ఇప్పటికే ఉన్న సంస్థలు కూడా బాగా విస్తరించాలన్న ఆశలో ఉన్నాయి.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
అందుకోసం ఐఐఎం, ఐఐటి లాంటి పెద్ద సంస్థల విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నాయి. తీరా విస్తరణ ఆలస్యం అవడమో, కంపెనీ ప్రారంభం కాకపోవడమో, మరో కారణం చేతనో, చాలా మంది ఈ కొత్త ఉద్యోగులకు నో చెప్పేస్తున్నారు.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
ప్రస్తుతం దాదాపు 8 కంపెనీల వరకూ ఇలా ఐఐటి, ఐఐఎం విద్యార్థులను త్రిశంకు స్వర్గంలో పెట్టేశాయి. హెల్త్ కేర్ రంగంలో పోర్షియా, గ్రాసరీస్ రంగంలో పెప్పర్ ట్యాప్ వంటి సంస్థలైతే మరీ దారుణం. ఆఫర్ లెటర్లు ఇచ్చిన తరువాత ఉద్యోగాల్లేవని చెప్పింది.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
లాజిస్టిక్స్ రంగంలో కూడా రోడ్ రన్నర్, టెక్నాలజీలో ఇన్ మొబి, కమ్యూటర్స్లో కార్దేఖో, స్టేజిల్లా వంటి సంస్థలు నియామకాలను బాగా ఆలస్యం చేస్తున్నాయి. చేతిలో ఆఫర్ లెటర్లు ఉన్నాయి. వేరే ఉద్యోగంలో చేరలేరు. ఈ కంపెనీలు ఎప్పుడు పిలుస్తాయో తెలీదు.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
ఎల్ అండ్ టి గ్రూపులో ఐటి కంపెనీ ఎల్ అండ టి ఇన్ఫోటెక్ దాదాపు వెయ్యి మందికి ఇచ్చిన ఆఫర్ లెటర్స్ రద్దు చేసింది. దాదాపు 1500 మంది అప్పాయింట్మెంట్లు రద్దు చేశారనే వాళ్లు కూడా ఉన్నారు.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
2015లో వీళ్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి, ఏడాది పాటూ పనీ పాటా లేకుండా ఖాళీగా ఉంచి, ఇప్పుడు మీకు ఉద్యోగాల్లేవనేసింది. అదికూడా డైరెక్టుగా చెప్పకుండా సెకండ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి పెట్టారు. ఈ గొడవ చెన్నైలో కొందరు విద్యార్థులు నిరాహారదీక్షలు చేసే వరకూ వెళ్లింది.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
అప్పట్లో భారీగా విస్తరించాలన్న ప్రణాళికలో ఉన్న ఫ్లిప్ కార్ట్ సంస్థ ఐఐఎం, ఐఐటీల నుంచి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది. వాళ్లందరికీ అప్పాయింట్ లెటర్లు ఇచ్చేసింది. కానీ ఎంతకీ పిలవలేదు.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
ఉద్యోగంలో చేర్చుకోవడం ఇంకా ఆలస్యం అవుతుందని సమాచారం కూడా ఇచ్చేసింది. ఇలా ఆలస్యం అయినందకు గానూ, వారు ఉద్యోగంలో చేరగానే లక్షన్నర రూపాయల అదనపు బోనస్ ఇస్తామని చెప్పింది. అటు ఐఐటీల నుంచి రిక్రూట్ చేసుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే వరకూ ఇంటర్న్షిప్గా పరిగణించడానికి ఒప్పుకుంది.
తెలుగు నేలపై నయా మోసం: 300 సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డు మీదకు..
ఇలా ఎన్నో కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆఫర్ లెటర్ లేకపోతే స్టూడెంట్ వాడి తిప్పలు వాడు పడతాడు.. అనవసరంగా విద్యార్థుల జీవితాలతోనూ, వాళ్ల విలువైన సమయంతోనూ ఈ కంపెనీలు ఆడుకోవడం మానేయాలని పలువురు కోరుకుంటున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470