జీవోఎస్ఎఫ్కు గూగుల్ గుడ్ బై
అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటీఎం వంటి ఆన్లైన్ షాపింగ్ సంస్థల జోరు నేపథ్యంలో ‘గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్'ను (జీవోఎస్ఎఫ్) ఈ ఏడాది నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
Read more: ఒబామా నీ గాడ్జెట్స్ కేక మామా

అమెరికాలో సైబర్ మండే తరహాలో వివిధ ఉత్పత్తులపై కొనుగోలుదారులకు భారీ డిస్కౌంటు ఆఫర్లు అందించేలా భారత్లో గూగుల్ 2012లో జీవోఎస్ఎఫ్ను ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం పలు ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి డీల్స్ను ప్రకటిస్తూనే ఉన్నాయి.
Read more: గూగుల్ రహస్య ఫోన్కు సవాల్

భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం లేదని, అటు కొనుగోలుదారులు కూడా అంత సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి లేదని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ డెరైక్టర్ నితిన్ బవన్కులె ఒక బ్లాగులో వ్యాఖ్యానించారు.
Read more: సామ్సంగ్ ఫోన్ల పై డిస్కౌంట్ల మోత

అందుకే జీవోఎస్ఎఫ్ను నిలి పివేయాల్సిన తరుణం వచ్చినట్లు చెప్పారు. 2012లో జీవోఎస్ఎఫ్ ప్రారంభమైనప్పుడు 90 రిటైలర్లు విక్రయాలు చేపట్టగా, 2013లో ఆ సంఖ్య 240కి , గతేడాది 550కి చేరింది.


Click it and Unblock the Notifications








