Home
News

5G టెక్నాలజీ వాడకం ఇండియాలో ఎప్పుడు?

ఇండియాలో మొదట ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువ ఉండేది. మొదట 2G,3G వాడకంలో తక్కువ బేస్ ఉండేది. ఇప్పుడు 4G టెక్నాలజీ రావడంతో ఇంటర్నెట్ వాడకం కూడా పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి 5G టెక్నాలజీ మీద పడింది. ప్రపంచం మొత్తం టెక్నాలజీ స్పీడ్ మీద ఆదారపడి పనిచేస్తోంది. 5G టెక్నాలజీ ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రతేకించి చెప్పవలసిన అవసరం లేదు. దీని ద్వారా ఇప్పుడు అందుతున్న ఇంటర్నెట్ స్పీడ్ కంటే 10రెట్లు అధిక వేగంతో అందుతుంది.

5G టెక్నాలజీ

భారతదేశంలో 5G టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే మీరు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌ను క్షణంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటే దాదాపు 2GB మెమొరీ ఉన్న వీడియోను కేవలం కొన్ని సెకన్ల వ్వవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తున్నప్పుడు స్థిరమైన బఫరింగ్‌ను కూడా నివారించవచ్చు.

G స్పెక్ట్రం

5G టెక్నాలజీకు సంబంధించి కొన్ని వాదనలు ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5G టెక్నాలజీ భారతదేశంలోని ప్రజలను చేరుకోవడానికి కనీసం మరొక 5-6 సంవత్సరాలు పట్టవచ్చు. 5 G స్పెక్ట్రం కేటాయింపు కూడా పూర్తిస్థాయిలో ఇంకా జరగలేదు అనే సాధారణ కారణం కూడా దీనికి ముఖ్య కారణం.

5 G సేవలకు

ఈ క్యాలెండర్ సంవత్సరంలో స్పెక్ట్రం వేలం జరుగుతుందని మంత్రిత్వ శాఖ కేటాయించిన రేడియోవేవ్‌లతో 5 G సేవలకు సంబంధించిన ట్రయల్స్ వచ్చే 100 రోజుల్లో ప్రారంభమవుతాయని ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం విషయాలు ఎలా కదులుతున్నాయో పరిశీలిస్తే ఇది చాలా ఆశాజనకంగా అనిపించదు.

OEM లు

మొత్తం 5G పర్యావరణ వ్యవస్థకు సంబందించిన అసలు పరికరాల తయారీదారులు (OEM లు), మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం మరియు ఎడ్జ్ డివైస్ లను ప్రస్తుతం కలిగి లేదు. కావున ఈ సందర్భంలో 5G టెక్నాలజీని చూడటానికి ఇప్పుడు సెట్ చేయబడిన వివిధ 5G- డివైస్ లు భారతీయ వినియోగదారులకు అనవసరంగా ఉన్నాయి.

2023 నాటికి

2023 నాటికి 5G టెక్నాలజీ భారతదేశంలో ప్రధాన స్రవంతిలోకి చేరుకుంటుందని మరియు 2025 నుండి సామూహిక మార్కెట్ గా ప్రారంభమవుతుందని అందరు ఆశిస్తున్నారు అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా అన్నారు. అయితే 3Gమరియు 4 G టెక్నాలజీలతో పోల్చితే ఇది చాలా ముందుగానే ఉంటుంది. ప్రతి తరం టెక్నాలిజీ అబివృద్దులకు మొదటి ప్రపంచ వాణిజ్యీకరణ నుండి భారతదేశంలో కనీసం ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు పట్టింది అని నీల్ షా అన్నారు.

5G రోల్‌అవుట్

5G రోల్‌అవుట్ కోసం భారత్ 2020 ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 5G యూజ్ కేసుల విచారణకు కూడా దేశం 5G స్పెక్ట్రంను ఆపరేటర్లకు కేటాయించలేదు. వ్యక్తిగత స్థాయిలో 5G ట్రయల్స్ నెమ్మదిగా ఎరిక్సన్, నోకియా, ఇంటెల్ మరియు హువాయిలతో కలిసి భారతదేశంలో 5G టెస్ట్ బెడ్ల వైపు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

IDC

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) ప్రకారం వాణిజ్య 5G విస్తరణలు చాలా ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. 2019 5G కు పరిచయ సంవత్సరంగా ఉండగా 2020 లో 5G ర్యాంప్ అప్ ప్రారంభమయ్యే సంవత్సరంగా కనిపిస్తుంది. 2020 లో 5G టెక్నాలజీతో రవాణా చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో ఎగుమతులు 8.9 శాతానికి చేరుకుంటాయని ఐడిసి అంచనా వేసింది. 123.5 మిలియన్ డివైస్ లను రవాణా చేయాలనీ చూస్తోంది . 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఇది 28.1 శాతానికి పెరుగుతుందని అంచనా.

IoT

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత కమ్యూనికేషన్స్ మరియు వీడియో అనలిటిక్స్ / స్ట్రీమింగ్‌లో పెద్ద మొత్తంలో అమలు చేస్తున్నట్లు ఇటీవలి గార్ట్‌నర్ నివేదిక పేర్కొంది. దాదాపు మూడింట రెండు వంతుల సంస్థలు 2020 నాటికి 5G టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నాయి. కాని కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ల సంసిద్ధత లేకపోవడం పట్ల జాగ్రత్తగా ఉన్నాయి.

సిఎస్పి

5G వినియోగదారులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ (సిఎస్పి) యొక్క సంసిద్ధత లేకపోవడం. వారి 5G నెట్‌వర్క్‌లు అందుబాటులో లేకపోవడం లేదా సంస్థల అవసరాలకు తగిన సామర్థ్యం కలిగివున్నాయి అని గార్ట్‌నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ సిల్వైన్ ఫాబ్రే విన్నపించారు. 600 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులకు 5G అనుభవాన్ని తీసుకురావడంలో భారతదేశంలో లక్ష్యంగా ఉంది.

Best Mobiles in India

English summary
India Likely To Wait For The Next 5 Years For 5G Technology Experience
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X