ఐపీఎల్ కోసం జియో హైస్పీడ్ వైఫై
ఐపీఎల్ మహా సంగ్రామం నిన్నటి నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సంబరాల్లో రిలయన్స్ జియో కూడా భాగమయింది.
ఐపీఎల్ మహా సంగ్రామం నిన్నటి నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సంబరాల్లో రిలయన్స్ జియో కూడా భాగమయింది. ఐపీఎల్ మ్యాచ్ లకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ హై-స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు జియో నెట్ వై-ఫైతో స్టేడియం మొత్తాన్ని కవర్ చేసింది.
ధర తక్కువ.. అయినా జియోని సపోర్ట్ చేస్తాయి

సేవలు పొందడానికి ప్రేక్షకులకు
క్రికెట్ ను వీక్షించడానికి వచ్చిన అభిమానులు తమ స్మార్ట్ ఫోన్లలో జియో హైస్పీడ్ వై-ఫై సేవల ప్రయోజనాలను పొందేలా అవకాశం కల్పిస్తోంది. ఈ సేవలు పొందడానికి ప్రేక్షకులకు కావాల్సిందల్లా ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే.

మొబైల్ నెంబరుకి ఓటీపీ
వై-పైకి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నెంబరుకి ఓటీపీ వస్తుంది.

ఓటీపీని జోడించగానే వై-ఫై కనెక్ట్
ఓటీపీని జోడించగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది. ఇలా జియో హై-స్పీడ్ వై-ఫై సేవలను ఐపీఎల్ ప్రేక్షకులు వినియోగించుకోవచ్చు.

ఐపీఎల్ అభిమానుల కోసమే
ఐపీఎల్ అభిమానుల కోసమే ఈ హైస్పీడ్ వైపై తీసుకొచ్చినట్లు రిలయన్స్ జియో చెప్పింది.



Click it and Unblock the Notifications