డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు
భారత్ను డిజిటల్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టు బుధవారం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Read More: ఎస్ఎంఎస్ పితామహుడు మట్టి మెకోనెన్ కన్నుమూత
కమ్యూనికేషన్ ప్రపచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను దేశనలుమూలలకు విస్తరింపజేసే లక్ష్యంతో ప్రారంభమైన ‘డిజిటల్ ఇండియా' దేశ చరిత్రలో ఓ ముందడుగు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా పథకం ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సామాన్యుల చెంతకు చేర్చే ప్రయ్నతం చేస్తోంది.
Read More: విమానంలో ప్రపోజ్ చేసి, సముద్రాన్ని చూపించాడు
దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టువిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంకా ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ఈ ప్రథకం ప్రధాన లక్ష్యం. డిజిటల్ ఇండియా వారంలో భాగంగా ప్రారంభమైన పలు డిజిటల్ సేవల వివరాలను క్రింది స్లైడ్షోలో చూడొచ్చు..
చేకూరు ప్రయోజనాలు: బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్ లలో భద్రపరుచుకుంటున్నట్లుగానే పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ లాకర్ లో సౌకర్యవంతంగా భద్రపరుచుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ వ్యవస్థను డిజైన్ చేసారు. MyGov.in ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రభుత్వ వ్యవహారలన్నీ సమన్వయరీతిలో పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చి సుపరిపాలనకు దోహదపడుతుంది. చేకూరు ప్రయోజనాలు: స్వచ్చ్ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. ఈ - సంతకం ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డ్లను ఉపయోగించుకుని డాక్యుమెంట్ల పై డిజిటల్ సంతకాలను చేయవచ్చు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవటంతో పాటు మీ సంతకానికి చట్టబద్ధంగా గుర్తింపు ఇంకా గోప్యత లభిస్తుంది. ఈ - ఆస్పత్రి పథకం ద్వారా పారదర్శకమైన ఆరోగ్య సేవలను దేశ పౌరులు పొందవచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, రక్తం అందుబాటు వంటి ముఖ్యమైన సేవలను ఈ - ఆస్పత్రి పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొందవచ్చు. జాతీయ ఉపకారవేతన పోర్టల్ చేకూరే ప్రయోజనాలు: ఈ పోర్టల్ ద్వారా ఉపకారవేతనాలకు అర్హులైన విద్యార్థులు కాలపరిమితిలోపు తమ అప్లికేషన్ లను పంపించటంతో పాటు తమ ఉపకార వేతనాల బదిలీ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి అన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమమే డిజిటైజ్ ఇండియా ప్లాట్ఫామ్ దేశంలోని 2,50,000 గ్రామ పంచాయితీలకు హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించే లక్ష్యంతో భారత్ నెట్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. బీఎస్ఎన్ఎల్ తరువాతి జనరేషన్ నెట్వర్క్ను ప్రజలకు చేరువచేయటం బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై హాట్స్పాట్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయటం
డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు


Click it and Unblock the Notifications








