ఎస్ఎంఎస్ పితామహుడు మట్టి మెకోనెన్ కన్నుమూత
టెక్స్ట్ మెసేజ్ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించి ఎస్ఎంఎస్ పితామహుడిగా గుర్తింపుతెచ్చుకున్న మట్టి మెకోనెన్ (63) కన్నుమూశారు. మొబైల్ నెట్వర్క్ల ద్వారా సందేశాలను పంపించుకునే సుదుపాయానికి ఆజ్యం పోసిన మెకోనెన్ తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు.

Read More: ఫేస్బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు!
కమ్యూనికేషన్ బంధాలను మరింత చేరవ చేసిన ఎస్ఎంఎస్ 1992, డిసెండర్ 3న ఆవిర్భవించింది. 22 ఏళ్ల బ్రిటీషు ఇంజనీర్ నీల్పాప్ వర్త్ మొట్టమొదటిసారిగా 'మేరీ కిస్మస్' అంటూ సంక్షిప్త సందేశం పంపారు. వోడాఫోన్ యూకే నెట్వర్క్ నుంచి ఆర్బిటెల్ 901 మొబైల్కు ఆయనీ ఎస్ఎంఎస్ చేశారు.

Read More: అరగంటలో 610 కిలోమీటర్ల ప్రయాణం?
అయితే ఇది జరగడానికి 8 ఏళ్ల ముందే జరిగిన టెలికమ్యూనికేషన్ కాన్పెరెన్స్లో ఫిన్లాండ్ ప్రభుత్వాధికారి మట్టి మెకోనెన్ పొట్టి సందేశం గురించి ప్రస్తావించారు. వాణిజ్య ఎస్ఎంఎస్ సేవలను స్వీడన్ 1993లో ప్రారంభించింది.

Read More: మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!
సంక్షిప్త సందేశాలు పంపుకునేందుకు అనువైన సెల్ఫోన్లు మొదటగా నోకియా కంపెనీ తయారుచేసింది. 1994లో ఎస్ఎంఎస్ ఎనబిల్డ్ నోకియా 2110 జీఎస్ఎమ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications








