పేటీఎమ్ కూడా బాదుడు షురూ చేసింది
పేటీఎమ్ కూడా ఇకపై బాదుడు మొదలు పెట్టింది. ఇకపై క్రెడిట్ కార్డులు ఉపయోగించి పేటీఎం రీఛార్జి చేస్తే 2శాతం ఫీజు వసూలు చేయనున్నారు.
పేటీఎమ్ కూడా ఇకపై బాదుడు మొదలు పెట్టింది. ఇకపై క్రెడిట్ కార్డులు ఉపయోగించి పేటీఎం రీఛార్జి చేస్తే 2శాతం ఫీజు వసూలు చేయనున్నారు.అయితే ఇప్పటి వరకు చాలా మంది క్రెడిట్ కార్డును వాడి పేటీఎం రీఛార్జి చేసి వాటిని బ్యాంక్ ఖాతాకు జమ చేసుకుంటున్నారు.
మోటో నుంచి 2 బెస్ట్ ఫీచర్ ఫోన్లు, 15 నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్

దీనివల్ల ట్రాన్సక్షన్ కాస్ట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతోంది. దీంతో ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇలా రీఛార్జి చేసినవారికి భవిష్యత్తులో అంతేమొత్తానికి క్యాష్బ్యాక్ ఆఫర్ ఇవ్వవచ్చు. ఇక నెట్బ్యాంకింగ్, డెబిట్ కార్డులతో రీఛార్జి చేస్తే ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు.
నమ్మలేని నిజం..జుకర్బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు

క్రెడిట్ కార్డ్ నెట్వర్క్లకు, ఇష్యూ చేసే బ్యాంకులకు పేటీఎం చెల్లించాల్సి రావడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబర్లో పేటీఎం చిరు వ్యాపారులే లక్ష్యంగా ప్లాట్ఫామ్ ఫీజ్ను రద్దు చేసింది. దీంతో వారు పేటీఎంను బాగా ఉపయోగించుకున్నారు.


Click it and Unblock the Notifications








