రూ.4,000కే 4జీ ఫోన్, అందించనున్న రిలయన్స్ జియో
అత్యధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ బ్రౌజింగ్తో పాట వేగవంతమైన మొబైల్ కాలింగ్ను వినియోగదారులకు చేరువ చేసే రిలయన్స్ జియో 4జీ మొబైల్ నెట్వర్క్ సేవలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం ప్రకటించారు.

తాము ప్రవేశపెట్టబోతున్నరిలయన్స్ జియో 4జీ సర్వీసుల ద్వారా వేగవంతమైన మొబైల్ కాలింగ్, వేగవంతమైన డేటా బ్రౌజింగ్, డిజిటల్ కామర్స్ ఇంకా చెల్లింపు సేవలను పొందవచ్చని అంబానీ వివరించారు.
కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

ఇందుకు అవసరమైన వీఓఎల్టీఈ (వాయిస్-ఓవర్-లాంగ్-టర్మ్-ఎవల్యూషన్) సాంకేతిక పై పనిచేసే 4జీ నెట్వర్క్ ఫోన్లను రూ.4,000లోపు ధరలకే సేవల ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని అంబానీ స్ఫష్టం చేసారు. పాత ఫోన్లోని డేటాన కొత్త ఫోన్లోకి సులభంగా బదిలీ చేసుకునేందుకు వీలుగా ‘జియోడ్రైవ్' యాప్ను అభివృద్థి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా


Click it and Unblock the Notifications