సత్య నాదెళ్ల సమక్షంలో కొత్త పాలసీలకు శ్రీకారం
హైదరాబాద్ను దేశంలోనే అత్యుత్తమ ఐటీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ నాలుగు సరికొత్త పాలసీలకు శ్రీకారం చట్టబోతోంది. ఈ నెల 28న నగరానికి రాబోతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమక్షంలో ఐటీ, ఇన్నోవేషన్, గేమింగ్, యానిమేషన్, హార్డ్వేర్ రంగాలకు మరింత ప్రోత్సాహం కల్పించే విధంగా సరికొత్త పాలసీలను ఆవిష్కరించబోతున్నట్లు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కే తారకరామారావు శనివారం విలేకరులకు తెలిపారు.
Read more: అత్యవసర పరిస్థితుల్లో 'సూపర్ ఐడియా'

ఐటీ రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నవంబర్ 5 టీహబ్ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ హబ్ను సందర్శించేందుకు సత్య నాదెళ్ల డిసెంబర్ 28న నగరానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భరంగా ఐటీ రంగానికి సంబంధించి నాలుగు కొత్త పాలసీలను ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యింది.
Read more: మీకు తెలియకుండా ఇంకొకరు వాడుతున్నారా..?

ఈ కొత్త పాలసీలను అమలులోకి తీసుకురావటం ద్వారా మరికొంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.


Click it and Unblock the Notifications








