అంతా రిలయన్స్ జియో పుణ్యమే !
జియో పుణ్యమా అని తాము అభివృద్ధి చెందినట్టు గేమ్స్2విన్ అనే గేమింగ్ సంస్థ పేర్కొంది. జియో రాకతో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగిందని, తమ గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య ఐదింతలు పెరిగిందని
జియో పుణ్యమా అని తాము అభివృద్ధి చెందినట్టు గేమ్స్2విన్ అనే గేమింగ్ సంస్థ పేర్కొంది. జియో రాకతో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగిందని, తమ గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య ఐదింతలు పెరిగిందని పేర్కొంది.
ఇండియాలో ఫోన్ పోతే దొరికే ఛాన్స్ ఎంత..?

భారత్లో గేమ్స్2విన్ నుంచి గేమ్స్ డౌన్ లోడ్స్ మూడు నెలల్లో ఐదింతలు పెరిగినట్టు ఆ సంస్థ సీఈవో, కో ఫౌండర్ అలోక్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం గేమ్స్2విన్ సంస్థ మొబైల్ ఫోన్లలో గేమ్స్ను డౌన్లోడ్ చేయకుండానే ఆడగలిగే వివిధ రకాల గేమ్స్ అభివృద్ధిలో బిజీగా ఉంది.
ధన్ ధనా ధన్ ఆఫర్కు క్లీన్ చిట్, మీకు తెలియని విషయాలు ఇవే !

వచ్చేవారు ఈ గేమింగ్ కంపెనీ నుంచి డ్రైవింగ్ అకాడమీ ఇండియా పేరుతో కొత్త గేమ్ విడుదల కాబోతోంది.రోడ్డు సిగ్నళ్లు, నిబంధనల గురించి కూడా ఈ గేమ్ తెలియజెబుతుందని కంపెనీ పేర్కొంది. తమ నుంచి వచ్చే గేమ్స్లో అధికశాతం డ్రైవింగ్ ఆధారంగానే ఉంటాయని, వాటిని ఆడేందుకు వినియోగదారులు ఇష్టపడతారని సంస్థ పేర్కొంది.
ఇకపై మెసేంజర్లోనూ గేమ్స్ ఆడుకోవచ్చు !

ఈ కంపెంనీ నుంచి మరో ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమైన ప్రకటన ఒకటి వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








