సంచలనం రేపుతున్న గూగుల్ కొత్త ఫోన్
పిక్సెల్ సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
గూగుల్ నెక్సస్ ఫోన్లకు బై బై చెప్పి, తన సొంత బ్రాండులో స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్లో పిక్సెల్ సిరీస్లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే తాజాగా పిక్సెల్ సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

అయితే ఈ సారి పిక్సెల్ 2 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ అచ్చం శాంసంగ్ ఎస్8, ఎస్8 ప్లస్లను పోలి ఉంటుందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్తోనే ఇది రూపొందుతుందట. వన్ ప్లస్5, షియోమి ఎంఐ6లకు కిల్లర్ గా గూగుల్ దీన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
రికార్డుల బుల్లి ఫోన్ వస్తోంది, దుమ్ము రేపే ఫీచర్లతో..

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 మాదిరి బెండబుల్ ఓలెడ్ డిస్ప్లేతో గూగుల్ తన తర్వాతి స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తుందని టాక్. వీటి కోసం ఎల్జీ డిస్ ప్లే సంస్థ నుంచి 880 మిలియన్ డాలర్ల ఓలెడ్ డిస్ ప్లేలను కూడా ఆర్డర్ చేసిందట.


Click it and Unblock the Notifications