ఈ ట్యాబ్లెట్ ధర రూ. 3999 మాత్రమే
అల్కాటెల్ పిక్సీ 4' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను విడుదల చేసింది. '
అల్కాటెల్ పిక్సీ 4' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను విడుదల చేసింది. 'వైఫై, 4జీ సిమ్' వేరియెంట్లలో విడుదలైన ఈ ట్యాబ్లెట్ వరుసగా రూ.3,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు లభిస్తోంది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ఆఫర్ అదిరింది, 1000 జిబి ఫ్రీ డేటా

అల్కాటెల్ పిక్సీ 4 (వైఫై) ఫీచర్లు
7 ఇంచ్ డిస్ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. 2 మెగాపిక్సల్ రియర్ కెమెరాతో పాటు 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. వైఫై, బ్లూటూత్ 4.0, 2580 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో అదనపు ఫీచర్లు
జియోకి పంచ్, కొత్త టెక్నాలజీతో వస్తున్న టాప్ 3 టెల్కోలు

అల్కాటెల్ పిక్సీ 4 (4జీ సిమ్) ఫీచర్ల విషయానికొస్తే 7 ఇంచ్ డిస్ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.1 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది. 8 మెగాపిక్సల్ రియర్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్, 4జీ (వాయిస్ కాలింగ్తో), బ్లూటూత్ 4.0, యూఎస్బీ ఓటీజీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు.


Click it and Unblock the Notifications








