సెకనుకు 7 ఫోటోలు తీసే కెమెరా ఇది
కెమెరా రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం కెనాన్ తన తరువాతి తరం కెమెరాను రిలీజ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చిన ఈ కెమెరా సెకనుకు 7 ఫోటోలు తీయగల సామర్ధ్యాన్ని కలిగిఉంది.
షాక్..జియో వల్ల రిలయన్స్కు వచ్చే ఆదాయం ఎంతంటే..

కెనాన్ఈఓఎస్ పేరుతో వస్తున్న ఈ కెమెరాను నాలుగోతరం 5డి ఫుల్ ఫ్రేమ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాగా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కెమెరా ధర 2,54,995 రూపాయల నుంచి 3,06,995 రూపాయల వరకు ఉంది. ఒక సెకను వ్యవధిలోనే 7 ఫొటో ఫ్రేమ్ను తీయడం ఈ కెమెరాలోని ప్రధా న ప్రత్యేకత.
తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

30.4 మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ సిఎంఔస్ సెన్సార్, 4కె వీడియో రికార్డింగ్, 3.2 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై/నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్ఎఫ్సి) కనెక్టివిటీ, ఇన్బిల్ట్ జిపిఎస్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వీటి మూలంగా చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఫాస్టెస్ట్ ప్రాసెసర్తో ఇంటెక్స్ ఫోన్

దీని బరువు 795 గ్రాములు ఉంటుంది. కెమెరా విడుదల సందర్భంగా కెనాన్ ఇండియా ప్రెసిడెంట్ కజుటడా మాట్లాడుతూ వచ్చే మూడేళ్ల కాలంలో 3,200 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

దీంతో పాటు గతేడాది అమ్మకాలను ప్రస్తావించారు. గత ఏడాదిలో అమ్మకాలు 2,158 కోట్ల రూపాయలుగా ఉన్నాయని, ఈ ఏడాదిలో 2,350 కోట్ల రూపాయలకు చేరుకునే ఆస్కారం ఉందన్నారు


Click it and Unblock the Notifications








