వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
వీడియో గేమ్స్ అంటే చాలమంది ఇష్టపడతారు. ఎంతలా అంటే పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా..ఇక ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే ఇక అంతే సంగతులు. వారిని తిట్టి కొట్టేదాకా వదిలిపెట్టరు కొంతమంది. అయితే ఇక్కడ కొట్టడం కాదు. ఎంతో అల్లారుముదుగా పెంచుకుంటున్న రెండేళ్ల కూతురును చంపేలా చేసింది ఆ వీడియో గేమ్ పిచ్చి. అవును కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్న తనను డిస్ట్రబ్ చేసిందనే కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురును చంపేశాడు. గొంతుపట్టి పిసికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
Read more: వివాదాస్పద వీడియో గేమ్స్!!

వివరాల్లోకెళితే అంథోని మైఖెల్ సాండర్స్ అనే వ్యక్తి గత డిసెంబర్లో ఎల్లీ శాండర్స్ అనే తన రెండేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు బాధ్యతలు చూసుకుంటున్నాడు. అయితే అతడు ఎలా ఆ బాలికను చంపాడనే విషయాన్ని పోలీసులు తెలుపుతూ 'ఆ సమయంలో అతడు కంప్యూటర్ గేమ్ లో విపరీతంగా లీనమై ఉన్నాడు. బహుశా. ఆ సమయంలో ఆ పాప అతడిని డిస్ట్రబ్ చేసి ఉంటుంది. అందుకే అతడు కొట్టడమే కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటాడు.
Read more: 2000 గంటల వీడియో గేమ్, రక్తం గడ్డకట్టి మరణించాడు

పోస్టుమార్టం నివేదిక కూడా ఆ పాపకు శ్వాస ఆడకచనిపోయిందని, రెండుమూడు గాయాలు కూడా ఉన్నాయని తెలిపింది 'అని చెప్పారు. తన భార్య ఒక ఆర్ట్ షోకు వెళ్లినప్పుడు అతడు ఈ అఘాయిత్యం చేసినట్లు చెప్పారు. కంప్యూటర్ గేమ్స వల్ల ఎంత ఘోర ప్రమాదాలు జరుగుతాయనే దానికి ఇది నిలువెత్తు నిదర్శనం. అతిగే వీడియో గేమ్ ఆడితే వచ్చే అనర్థాలను ఇక్కడ ఇస్తున్నాం చూడండి.
Read more : కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
గేమింగ్ కన్సోల్ కారణంగా తలెత్తె ఈ స్కిన్ డిసార్డర్ చేతి వేళ్లను ఇలా మార్చేస్తుంది.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
స్నాయువు గాయాలు

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
అతిగా వీడియో గేమ్లను ఆడటం వల్ల మూర్చ వచ్చే ప్రమాదం.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
అతిగా వీడియోగేమ్స్ ఆడటం వల్ల దూకుడు ప్రవర్తనతో పాటు మానసిక సమస్యలు తలెత్తే అవకాశముంది.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
అతిగా వీడియో గేమ్స్ ఆడితే కంటి చూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
మణికట్టు దెబ్బతినే ప్రమాదం.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
మొదడు పూర్తిగా మొద్దు బారిపోయే ప్రమాదం.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
ఏకధాటిగా 22 రోజుల పాటు ఓ కంప్యూటర్ గేమ్లో నిమగ్నమైన కుర్రోడు అనారోగ్యం పాలై మరణించాడు. ఉల్చాయ్కు చెందిన 17 సంవత్సరాల రుస్తామ 22 రోజుల పాటు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడటంతో శారీరక కదలికలు లేకపోవటంతో రక్త గడ్డకట్టి, ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చని వైద్యులు రిపోర్ట్ లో తేల్చారు.

వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది
ఇక ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








