సెల్కాన్ నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్
మిలీనియా సిరీస్ పేరుతో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న సెల్కాన్ 'మిలీనియం యూ ఫీల్' పేరుతో ఇపుడు మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ధరను రూ. 3,299గా కంపెనీ నిర్ణయించింది. గ్యాడ్జెట్ 360 వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆగస్టు24న అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండియాలో పాగా వేసేందుకు మరో చైనా కంపెనీ రెడీ

మిలీనియా యూ ఫీల్ ఫీచర్లు విషయానికొస్తే 1.2గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో పాటు , 1జీబీ రామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. అలాగే 32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ సామర్థ్యం ఉంటుంది. కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3.2 మెగాపిక్సెల్ ముందు కెమెరా పొందుపరిచారు.
బిగ్ బి సెల్ఫీ కల ఎవరితో..సచిన్ విన్న శుభవార్త ఏంటీ..?

2000ఎంఎహెచ్ బ్యాటరీ తో మొబైల్ వస్తోంది. డ్యూయల్ సిమ్ తో వస్తున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డెన్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. లోకాస్ట్ ఫోన్ల తయారీలో దేశీయ మొబైల్ మార్కెట్ ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించిన సంస్థ సెల్ కాన్ స్వదేశీ పరిజ్ఞానం తో స్మార్ట్ఫోన్లను రూపొందిస్తోంది. ఈ కోవలోనే మిలీనియం స్మార్ట్ ఫోన్ లైన్ పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470 రెండు రకాల మోడళ్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
14 వేల మంది ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా..?


Click it and Unblock the Notifications








