ఇంటెక్స్ నుంచి మరో రెండు 4జీ ఫోన్లు
దేశీయ మొబైల్ దిగ్గజం ఇంటెక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
దేశీయ మొబైల్ దిగ్గజం ఇంటెక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆక్వా 4.0 4జీ, ఆక్వా క్రిస్టల్ పేర్లతో రెండు మొబైల్స్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరల్లో వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. లోఎండ్ స్మార్ట్ఫోన్ ఆక్వా 4.0 4జీ ధరను 4,199గా కంపెనీ నిర్ణయించింది.
బడ్జెట్ రేంజ్లో మార్కెట్లోకి మరో కొత్త 4జీ వోల్ట్ ఫోన్

ఆక్వా 4.0 4జీ ఫీచర్ల విషయానికొస్తే 4 ఇంచెస్ డిస్ ప్లే తో పాటు 360x640 రిజల్యూషన్ కలిగి ఉంది. 512ఎంబీ ర్యామ్,4జీబీ స్టోరేజ్ కెపాసిటీ, మైక్రో ఎస్డి ద్వారా 64 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం. 2ఎంపీ రియర్ కెమెరాతో పాటు వీజీఏ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 1500 ఎంఏహెచ్ బ్యాటరీ,బ్లాక్ అండ్ వైట్ బ్లూ కలర్స్ లో లభ్యమవుతోంది.
రూ. 28 వేలకే పిక్సల్ ఫోన్, ఎలాగో తెలుసా..?

ఆక్వా క్రిస్టల్ ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచెస్ హెచ్డీ డిస్ ప్లే తో పాటు 720 x 1280 రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డి ద్వారా 128 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం. 8ఎంపీ రియర్ కెమెరా తో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
సిమ్కార్డు వాడే వారికి సుప్రీంకోర్టు హెచ్చరిక

2100 ఎంఏహెచ్ బ్యాటరీ , బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో పోన్ లభ్యమవుతోంది. ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ అయిన ఈ ఆక్వా క్రిస్టల్ ధరను 6,990 గాను నిర్ణయించింది.


Click it and Unblock the Notifications