మరో శక్తివంతమైన చైనా ఫోన్ ‘మిజు ఎంఎక్స్5’

భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో శక్తివంతమైన చైనా ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల కంపెనీ మిజు (meizu), మంగళవారం చైనా రాజధాని బీజింగ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ఎంఎక్స్5' పేరుతో సరికొత్త ఆక్టాకోర్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.భారత మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. మిజు ఎంఎక్స్5 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....
Read More: హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు

మెటల్ బాడీ ఇంకా ప్రీమియమ్ లుక్, ఫోన్ బరువు 149 గ్రాములు, 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫ్లైమ్ ఓఎస్ (FlymeOS).
Read More: బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్ఫోన్లు

64 - బిట్ మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.
Read More: 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తివంతమైన స్మార్ట్ఫోన్లు

2160 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌకర్యంతో కూడిన 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, 3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ప్రత్యేక ఫీచర్లు.. మిజు ఎంటచ్ 2.0 టెక్నాలజీ, ఎంపే వ్యాలెట్.
Read More: టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో


Click it and Unblock the Notifications








