ఎయిర్టెల్ యాడ్కి బ్రేక్ పడింది
నాలుగో తరం తరంగాల పనితీరును తెలియజేస్తూ..ఎయిర్ టెల్ 4జీ ఎప్పుడైనా ఎక్కడైనా వేగంవతమైన నెట్ వర్క్.ఒక వేళ మీ నెట్ వర్క్ ఇంతకన్నా వేగంగా ఉంటే మేము జీవితాంతం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తామంటూ ప్రసారమవుతున్న వ్యాపార ప్రకటనను ఎయిర్ టెల్ ఉపసంహరించుకోనుంది. ఈ ప్రకటన ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఉందని ప్రకటనల ప్రమాణ విభాగం నుంచి ఎయిర్ టెల్ కు నోటీసులు వెళ్లాయి.
Read more:ఎల్జీ రెండు డిస్ప్లేల ఫోన్ ‘LG V10'

తక్షణమే ఈ యాడ్ ప్రసారాన్ని నిలిపివేయాలని ఏఎస్ సీఐ ఆదేశించింది. ఈ ప్రకటనను సమీక్షించిన ఏఎస్ సీఐ ఇది కోడ్ చాప్టర్ 1.4ను అతిక్రమించినట్లు అభిప్రాయపడింది. దీంతో పాటు వాస్తవాలను వక్రీకరించేలా ఉందని పేర్కొంది.
Read more: గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు

తమ 4జీ సేవలే దేశంలో బెస్ట్ అనడానికి ఆ సంస్థ ఆధారాలు చూపడంలో విఫలమైందని పేర్కొంది. ఓవినియోగదారుడు చేసిన ఫిర్యాదుతో ఏఎస్ సీఐ ఈ విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. తమకు ఆదేశాలు అందగానే ఈ ప్రకటనను నిలిపివేస్తామని ఎయిర్ టెల్ వెల్లడించింది.
Read more : పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు
అంతకన్నా ముందు తమ వద్ద ఉన్న సాంకేతికత గణాంకాలను 4 జీ తరంగాల వేగాన్ని ఏఎస్ సీఐ ముందుంచి వారిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.


Click it and Unblock the Notifications








