జియో ఉచితంపై ట్రాయ్ మీద ఎయిర్టెల్ ఫిర్యాదు
90 రోజుల కాల పరిమితి తీరిన తర్వాత కూడా ఉచిత సేవలు కొనసాగించడంపై ఎయిర్ టెల్ మండిపాటు
ముఖేష్ అంబాని రిలయన్స్ జియో 90 రోజుల కాల పరిమితి తీరిన తర్వాత కూడా ఉచిత సేవలు కొనసాగించేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అనుమతించడాన్ని సవాలు చేస్తూ భారతీ ఎయిర్టెల్ సంస్థ టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ను ఆశ్రయించింది.
ట్రంప్ ఐఫోన్, ఖరీదెంతో తెలుసా..?

జియో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ట్రాయ్ ప్రేక్షక పాత్ర వహిస్తోందని పేర్కొంది. ఈ నెల 3 తర్వాత జియో ఉచిత వాయిస్, డేటా సేవలు కొనసాగించకుండా ట్రాయ్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఎయిర్టెల్ తన 25 పేజీల పిటిషన్లో ట్రిబ్యునల్ను కోరింది.
జియోని కుదిపేస్తున్న రూ.149 అన్లిమిటెడ్ ప్లాన్

ట్రాయ్ టారిఫ్ ఆదేశాల ఉల్లంఘన ఈ ఏడాది మార్చి నుంచి కొనసాగుతోందని, దీంతో తమకు రోజువారీ నష్టాలు వాటిల్లుతున్నాయని ఉచిత కాల్స్ వల్ల విపరీతమైన ట్రాఫిక్తో తమ నెట్వర్క్కు విఘాతం కలుగుతున్నట్టు ఎయిర్టెల్ ఆరోపించింది.

ఉచిత సేవల కొనసాగింపు ట్రాయ్ ఆదేశాలు, నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘంచిడమేనని, అందుకే పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చినట్టు ఎయిర్టెల్ పేర్కొంది.కాగా జియో దెబ్బకు టెలక్కోలు భారీ నష్టాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








