వన్నాక్రై నెక్స్ట్ టార్గెట్ ఇదే, ఇక అల్లకల్లోలమే !
ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై రాన్సమ్ వేర్ ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి.
ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై రాన్సమ్ వేర్ ముప్పు మళ్లీ పొంచి ఉందని సైబర్ సెక్యురిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. మళ్లీ ఏ క్షణానైనా ఈ సైబర్ దాడి పొంచుకురావచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహల్ చెప్పారు.
ఆగని Airtel దూకుడు, మళ్లీ సరికొత్త ఆఫర్లు, పైసా ఖర్చు లేకుండా..

అయితే తర్వాతి టార్గెట్ అరచేతిలో ప్రపంచాన్ని నిలుపుతున్న స్మార్ట్ ఫోన్లేనని సంజయ్ హెచ్చరించారు. గత శుక్రవారం విజృంభించిన ఈ వన్నాక్రై అటాక్ తో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్స్ స్తంభించాయి. పీసీల డేటా అంతా తమ గుప్పిట్లోకి తీసుకుని ఈ అటాకర్లు నానా హంగామా చేశారు.
ఈ రోజే సేల్, పాత రికార్డులు చెరిపేస్తుందా ? కొనాలా, వద్దా ఓ 5 కారణాలు !

మొబైల్స్ లో అత్యధికులు వాడేది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నే. ఒకవేళ హ్యాకర్లు కనుక దీన్నే టార్గెట్ చేస్తే, ప్రపంచమంతా ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదని సంజయ్ చెప్పారు. హ్యాకర్లు రెండు దశలో ముందుకు వెళ్తున్నారని, అయితే తర్వాత ఏంటన్నది తెలియడం లేదని చెప్పారు.
వన్ ఇయర్ ఇంటర్నెట్ ఉచితం, ఆ ఫోన్ సేల్ ఈ రోజే !

ఒకవేళ ఈ అటాక్స్ ను ఆపవచ్చు లేదా వేరియంట్లను టార్గెట్ చేసి మరోమారు తమ ప్రతాపం చూపవచ్చని తెలిపారు.


Click it and Unblock the Notifications








