Just In
- 31 min ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 35 min ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
- 2 hrs ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 3 hrs ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
Don't Miss
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Movies Mrunal Thakur గ్లామర్తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్గా
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
7లక్షల కోట్లతో నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ను ప్రకటించిన ప్రభుత్వం
గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ ఎకానమీని పెంచుకోవడానికి భారత్ అడుగులు వేస్తోంది. ప్రస్తుత కాలంలో ఇండియాలో సుమారు 117 కోట్లకు పైగా చందాదారులు మొబైల్ ఫోన్లను వాడుతున్నారు.అలాగే వీరందరు రోజుకు సగటున 10GB ఇంటర్నెట్ డేటాను వినియోగిస్తున్నారు.
ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ డిజిటలైజేషన్ ను మరింతగా మెరుగుపరచడానికి నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ను ప్రారంబిస్తున్నది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియాలోని మారుమూల గ్రామీణ గ్రామాల ప్రాంతాలకు కూడా సరసమైన ధరల వద్ద మెరుగైన హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...
న్యూ డిల్లీలో జరిగిన కార్యక్రమంలో కమ్యూనికేషన్స్, లా అండ్ జస్టిస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ను (NBM) ప్రారంభించారు. డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల వృద్ధిని వేగంగా గుర్తించడం, డిజిటల్ విభజనను తగ్గించడం, అందరికీ సరసమైన మరియు సార్వత్రిక బ్రాడ్బ్యాండ్ను అందించడం మరియు డిజిటల్ సాధికారత మరియు చేరికను సులభతరం చేయడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2022 చివరి నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించాలని NBM నిర్ధారనకు వచ్చింది.
Realme PaySa యాప్తో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లోకి రియల్మి
నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్: ఇది ఖచ్చితంగా ఏమిటి?
నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ (NDCP) కొత్తగా ప్రకటించిన నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ (NBM ) కి భిన్నంగా ఉందని గమనించాలి. ఈ మిషన్ యొక్క కొన్ని లక్ష్యాలు: 2022 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ యాక్సిస్ ను అందించడం. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు మరియు ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు యాక్సిస్ ను సులభతరం చేయడం. అలాగే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ యొక్క విస్తరణను 30 లక్షల కిలోమీటర్లకు పెంచడం మరియు 2024 నాటికి టవర్ సాంద్రత వెయ్యి జనాభాకు 0.42 నుండి 1.0 వరకు పెంచడం లక్షంగా పెట్టుకున్నది.
పైన పేర్కొన్న మూడు మిషన్లతో పాటు నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ మొబైల్ మరియు ఇంటర్నెట్ కోసం సర్వీస్ల నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైట్ ఆఫ్ వే (RoW) కోసం వినూత్న నమూనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. OFC వేయడానికి అవసరమైన RoW ఆమోదాలతో సహా డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన విధానాలు స్థిరంగా ఉండటానికి రాష్ట్రాలు / UT లతో కలిసి పనిచేయడానికి సహాయపడుతుంది.
దేశవ్యాప్తంగా డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ మరియు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మరియు టవర్స్తో సహా మౌలిక సదుపాయాల యొక్క డిజిటల్ ఫైబర్ మ్యాప్ను కూడా ప్రభుత్వం రూపొందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు రాబోయే 3 నుంచి 4 సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి 7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఇందులో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) నుండి 70,000 కోట్ల రూపాయలతో సహా 100 బిలియన్ డాలర్ల (రూ .7 లక్షల కోట్లు) వాటాదారుల నుండి భారీ పెట్టుబడులతో NBM ప్రాజెక్ట్ మొదలు కానున్నది.
సరసమైన బ్రాడ్బ్యాండ్ యాక్సిస్ తో పాటు మిషన్ కింద తెలిపే లక్ష్యాలపై కూడా దృష్టి పెడుతున్నది
(1) ఆప్టికల్ ఫైబర్ మార్గాన్ని 22 లక్షల కిలోమీటర్ల నుండి 50 లక్షల కిలోమీటర్లకు పెంచడం
(2) ఇప్పుడు ఉన్న 5.65 లక్షల మొబైల్ టవర్లను 2024 నాటికి 10 లక్షలకు పెంచడం
(3) దేశంలోని మొబైల్ మరియు ఇంటర్నెట్ నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడం.
ఇండియాలోని 12 రాష్ట్రాలు ఇప్పటికే భారత ప్రభుత్వం యొక్క ఈ ప్రత్యేక మిషన్లోకి చేరాయి. మరికొన్ని రాష్ట్రాలు రాబోయే నెలల్లో ఆన్బోర్డ్లోకి వస్తాయి అని పత్రిక సమావేశంలో తెలిపారు.
నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ భారతదేశంలో డిజిటల్ వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల వృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో స్వదేశీ డిజిటల్ సేవలను సృష్టించడం మరియు పంపిణీ చేయడాన్ని నిర్ధారిస్తూ ‘డిజిటల్ ఇండియా' మిషన్కు పరోక్షంగా దోహదం చేస్తుంది. ఇందులో అతి పెద్ద లక్ష్యం ఇండియాను ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ' వైపు నడిపించడం. మన దేశం యొక్క వ్యాపారానికి అసాధారణమైన సామర్థ్యం ఉందని ప్రసాద్ తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470